'హిందీ గో బ్యాక్!', 'దక్షిణాదిపై వివక్ష వీడేదెన్నడు'.. ఇవి చూడండి: పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో మరోసారి స్పందించారు. దక్షిణాదిపై వివక్ష అంశానికి సంబంధించి పత్రికల్లో వచ్చిన రెండు ఆర్టికల్స్ను జనసేన అధినేత పోస్ట్ చేశారు.
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో మరోసారి స్పందించారు. దక్షిణాదిపై వివక్ష అంశానికి సంబంధించి పత్రికల్లో వచ్చిన రెండు ఆర్టికల్స్ను జనసేన అధినేత పోస్ట్ చేశారు.
'దక్షిణాదిపై వివక్ష వీడెదెన్నడు?' అనే శీర్షికన సూర్యలో వచ్చింది. 'హిందీ గో బ్యాక్!' అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఈ రెండింటిని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు.
పవన్ కళ్యాణ్-జగన్లకు 'ముందస్తు' చెక్: చంద్రబాబు వ్యూహమా, జాగ్రత్తలా?
North Indian political leadership should understand & respect the cultural diversity of our Country. pic.twitter.com/DFwIqyXXgk
— Pawan Kalyan (@PawanKalyan) April 23, 2017
వాటిని పోస్ట్ చేసి రెండు కామెంట్లు కూడా పెట్టారు. ఉత్తరాది రాజకీయ నాయకులు మన దేశంలోని వివిధ ప్రాంతాల వైవిధ్యాన్ని గుర్తించాలని, అర్థం చేసుకోవాలని, గౌరవించాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
Forwarding this article about North - South Disparity. pic.twitter.com/6nrfNuse5e
— Pawan Kalyan (@PawanKalyan) April 23, 2017
ఉత్తరాది - దక్షిణాది మధ్య అంతరం చెప్పేందుకు దీనిని ఫార్వార్డ్ చేస్తున్నానంటూ 'దక్షిణాదిపై వివక్ష వీడెదెన్నడు?' అనే ఆర్టికల్ పోస్ట్ చేశారు. పవన్ ట్విట్టర్ ద్వారా పలు అంశాలపై స్పందిస్తోన్న విషయం తెలిసిందే.