జాగ్రత్త!: ‘ఒక్కరోజులోనే కోటీశ్వరులు కావాలనుకోవద్దు’
రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావాలని కోరుకోకూడదని, దీని వల్ల నష్టమే ఎక్కువగా ఉంటుందని తెలంగాణ డీజీపీ అనురాగ్శర్మ ప్రజలకు సూచించారు.
హైదరాబాద్: రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావాలని కోరుకోకూడదని, దీని వల్ల నష్టమే ఎక్కువగా ఉంటుందని తెలంగాణ డీజీపీ అనురాగ్శర్మ ప్రజలకు సూచించారు. ఎక్కువ రాబడి వస్తుందన్న పథకాలను నమ్మవద్దని, వీటివల్ల మోసపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) ఆధ్వర్యంలో బ్యాంకింగేతర సంస్థల కార్యకలాపాలు-ఖాతాదారుల రక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశంపై బుధవారం తెలంగాణ పోలీసుశాఖ, సీఐడీ విభబాగానికి శిక్షణ నిర్వహించారు. అనురాగ్శర్మ ఇందులో పాల్గొని ప్రసంగించారు.
నకిలీ చిట్ఫండ్లు, గొలుసుకట్టు వ్యాపార పథకాల వంటి ఆర్థిక నేరాల విషయంలో పోలీసులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యం మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు.

ఆర్థిక నేరాలు, మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీంలు, కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ స్కీమ్స్, బోగస్ చిట్ ఫండ్స్పై పోలీసు అధికారులు కూడా అవగాహన కలిగి ఉండాలని డీజీపీ చెప్పారు.
ఇటీవల కాలంలో ఆన్లైన్ పేమెంట్స్, మొబైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరిగినందున నేరాలు కూడా పెరిగే అవకాశం ఉందని, వీటిపైనా దృష్టి సారించాలని అన్నారు. పోలీసులు, నియంత్రణా సంస్థలైన ఆర్బీఐ, సెబీ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ మొదలగునవి ఈ విధమైన నేరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications