ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్: నేరం అంగీకరించిన నిందితులు వారిపై లుకౌట్ నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో ఇద్దరు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని శనివారం సుదీర్ఘంగా విచారించిన అధికారులు.. ఎస్ఐబీలో హార్డ్డిస్క్లు ధ్వంసం చేసిన విషయంలో భుజంగరావు, తిరుపతన్నల పాత్ర ఉన్నట్లు గుర్తించారు.
ఏడు రోజుల కస్టడీలో భాగంగా ప్రణీత్రావు ఇచ్చిన వివరాల ఆధారంగా కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్రావు(Prabhakar rao), మాజీ టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఐన్యూస్ యజమాని శ్రవణ్ల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. శుక్రవారం రాత్రి నిఘా విభాగం మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్రావు, మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు.

అదే సమయంలో భుజంగరావు, తిరుపతన్న ఇళ్లలోనూ సోదాలు జరిపిన పోలీసులు.. శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు రావాలవి 41ఏ - సీఆర్పీసీ నోటీసులు అందించారు. విచారణ అనంతరం ఇద్దరు ఏఎస్పీలను అరెస్టు చేసినట్లు వెస్ట్జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచగా కేసు పూర్వాపరాలు, ఆధారాలు పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.
ఇది ఇలావుండగా, ట్యాపింగ్ వ్యవహారంలో నిఘా విభాగం మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు, మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావులపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రణీత్ రావు కస్టడీలో చెప్పిన అధికారుల పేర్లతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారేమోననే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. కస్టడీ విచారణలో ప్రణీత్ రావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినట్లు అంగీకరించారు. దీంతో ఎస్ఐబీలో నోడల్ అధికారి కాకుండా ప్రణీత్ రావే, 'లా ఆఫ్ ఇంటర్సెప్షన్'లా ఫోన్కాల్స్ను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు, చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న భుజంగ రావు, తిరుపతన్న తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని అంగీకరించినట్లు సమాచారం. ఉన్నతాధికారి ఆదేశాల మేరకే తాము పని చేశామని, ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని వారు అంగీకరించినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు నాగోలు మూసీ వంతెన కింద హార్డ్డిస్క్ల భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎఫ్ఎస్ఎల్కు పంపించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications