నిజాం రాజులు వేటాడిన ప్రదేశం.. హైదరాబాద్ కు 110 కి. మీ. దూరంలో..!
తెలంగాణను శాతవాహనుల నుంచి నిజాం రాజుల వరకు అనేక సామ్రాజ్యాలు పరిపాలించాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, నిజాం రాజులు పలు విధాలుగా అభివృద్ధి చేస్తూ వచ్చారు. నిజాం ప్రభువుల పరిపాలనలో హైదరాబాద్ సామ్రాజ్యం విస్తరించింది. హైదరాబాద్ ను మొత్తం ఏడుగురు నిజాం ప్రభువులు పరిపాలించారు. అయితే అందులో ఆరో నిజాం అయిన మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కు వేట అంటే ఇష్టం అని పలు ఆధారాల ద్వారా తెలుస్తోంది.
ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ వారాంతాల్లో వేటకు వెళ్లేవారు. ఆయన పోచారం ప్రాంతంలోని అడవుల్లో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తూ దాదాపు 33 మందిని తినేసిన రెండు పులులను వీరోచితంగా వేటాడి హతమార్చినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. పులులను వేటాడి చంపి.. ప్రజలకు వాటి నుంచి విముక్తి కలిగించినందుకు గాను మీర్ మహబూబ్ అలీ ఖాన్ కు తీస్ మార్ ఖాన్ అనే బిరుదు కూడా వచ్చింది.
ఇక నిజాం ప్రభువులు వేటాడిన ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా..? అదే పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ.. పోచారం వన్యప్రాణుల అభయారణ్యంగా పేరు గాంచిన ఈ ప్రదేశం తెలంగాణ మెదక్ జిల్లాలోని పోచారంలో ఉంది. ఇప్పుడు ప్రకృతి రమణీయమైన ప్రదేశంగా మారింది. బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా పర్యటకులను ఆకర్షిస్తోంది. దాదాపు 5,600 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అభయారణ్యంలో 600 కు పైగా జింకలు సహా నెమళ్లు, దుప్పులు, మనుబోతులు, అడవి పందులు తదితర వన్యప్రాణులు ఉన్నట్లు సమాచారం.
అలాగే పోచారం అభయారణ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సఫారీ వాహనంలో ప్రయాణిస్తూ సందర్శకులు జంతువులను దగ్గరగా వీక్షించవచ్చు. ఈ సఫారీ టికెట్ ధరలు పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 గా ఉన్నాయి. వీరితో పాటు గైడ్ సాయంతో సఫారీ చేస్తుంటారు. విద్యార్థుల కోసం వన్యప్రాణుల మోడల్స్, ఫొటోలు, టీవీ ప్రదర్శనల ద్వారా విద్యాపరమైన సమాచారాన్ని అందిస్తున్నారు. మెదక్ పట్టణానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అభయారణ్యం సెలవు రోజుల్లో కుటుంబ సమేతంగా ప్రకృతిని ఆస్వాదించేందుకు సరైన ప్రదేశంగా మారింది.

పోచారం వన్యప్రాణుల అభయారణ్యాన్ని చూసేందుకు హైదరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
'తెలంగాణ అమర్నాథ్ యాత్ర'.. నల్లమల అడవిలో అడ్వెంచర్ జర్నీ చేద్దామా..?? -
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications