Loksabha Election 2024: ఆ ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్.. ఎందుకంటే..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.తెలంగాణలోని ఐదు ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13అసెంబ్లీ సెగ్మెంట్లు సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేటలో సాయంత్రం 4గంటలకు పోలింగ్ ముగిసింది.
ఏపీలోని అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో మధ్యాహ్నం 3 గంటల వరకు అసెంబ్లీ, లోక్ సభ కలిపి 55.49శాతం పోలింగ్ నమోదు అయింది. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదయింది. ఖమ్మంలో 63.67 శాతం, కరీంనగర్ 58.24, మహబూబాబాద్ 61.4, పెద్దపల్లి 55.92, నల్గొండ 59.91 శాతం చొప్పున నమోదు అయింది.

తిరుపతిలోని 13వ వార్డులో 141, 142, 143 బూత్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దొంగ ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ, వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. తాడికొండ నియోజకవర్గం నిడుముక్కలలో 83వ బూత్ వద్ద తెదేపా- వైకాపా వర్గాల ఘర్షణ జరిగింది. వనపర్తి జిల్లా అమరచింత జడ్పీ హైస్కూల్లో 2గంటలుగా ఈవీఎం పనిచేయడం లేదు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications