Loksabha Election 2024: ఆ ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్.. ఎందుకంటే..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.తెలంగాణలోని ఐదు ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13అసెంబ్లీ సెగ్మెంట్లు సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేటలో సాయంత్రం 4గంటలకు పోలింగ్ ముగిసింది.
ఏపీలోని అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో మధ్యాహ్నం 3 గంటల వరకు అసెంబ్లీ, లోక్ సభ కలిపి 55.49శాతం పోలింగ్ నమోదు అయింది. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదయింది. ఖమ్మంలో 63.67 శాతం, కరీంనగర్ 58.24, మహబూబాబాద్ 61.4, పెద్దపల్లి 55.92, నల్గొండ 59.91 శాతం చొప్పున నమోదు అయింది.

తిరుపతిలోని 13వ వార్డులో 141, 142, 143 బూత్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దొంగ ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ, వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. తాడికొండ నియోజకవర్గం నిడుముక్కలలో 83వ బూత్ వద్ద తెదేపా- వైకాపా వర్గాల ఘర్షణ జరిగింది. వనపర్తి జిల్లా అమరచింత జడ్పీ హైస్కూల్లో 2గంటలుగా ఈవీఎం పనిచేయడం లేదు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications