గంటపాటు చీకట్లో హైదరాబాద్ రాజ్ భవన్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నివసించే రాజ్ భవన్ శనివారం రాత్రి ఎర్త్ అవర్ను పాటించింది. రాత్రి ఎనిమిదిన్నర గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు.. గంట సేపు విద్యుత్ వినియోగాన్ని రాజ్ భవన్లో నిలిపేశారు.
గవర్నర్ నరసింహన్ దంపతులు, అధికారులు గంట సేపు కొవ్వొత్తుల వెలుగులోనే ఉంన్నారు. రాజ్ భవన్లోని అన్ని భవనాలలోని దీపాలు, ఏసీలు, వీధి దీపాలకు సైతం విద్యుత్ను నిలిపి వేశారు. కాగా, విద్యుత్ ఆదా కోసం ఎర్త్ అవర్ నిర్వహిస్తుంటారనే విషయం తెలిసిందే.

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో కూడా గంట పాటు విద్యుత్ నిలిపివేశారు. ఎర్త్ అవర్లో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్డీ ఉంటున్న రాష్ట్రపతి భవన్లో గంట పాటు విద్యుత్ నిలిచిపోయింది. దీంతో వెలుగులతో జిగేల్ మంటూ కనిపించే రాష్ట్రపతి భవన్.. చీకటిగా కనిపించింది.













Click it and Unblock the Notifications