రసమయి సంచలనం: 'ఎమ్మెల్యే' అయినందువల్లే గద్దర్కు అసూయ
తాను ఎమ్మెల్యేగా గెలిచానన్న అసూయతో గద్దర్ తనతో మాట్లాడటమే మానేశారని, ఇదే కారణంతో అందెశ్రీ సైతం రెండేళ్లుగా మాట్లాడలేదని రసమయి బాలకిషన్ పేర్కొనడం గమనార్హం.
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈమధ్య తరుచుగా వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు. ఆమధ్య కరీంనగర్ కలెక్టర్ తో వాగ్వాదానికి దిగి వార్తల్లోకి ఎక్కిన ఆయన.. తాజాగా ప్రజా యుద్దనౌక గద్దర్, ప్రజా వాగ్గేయకారుడు అందేశ్రీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

తాను ఎమ్మెల్యేగా గెలిచానన్న అసూయతో గద్దర్ తనతో మాట్లాడటమే మానేశారని, ఇదే కారణంతో అందెశ్రీ సైతం రెండేళ్లుగా మాట్లాడలేదని రసమయి బాలకిషన్ పేర్కొనడం గమనార్హం. శుక్రవారం నాడు రవీంద్రభారతిలో నిర్వహించిన బాబూ జగ్జీవన్ రామ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల సందర్బంగా రసమయి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈర్ష్యా ద్వేషాలను పక్కనబెట్టి దళితులంతా తమ హక్కుల కోసం పోరాడాలని రసమయి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు సుంపాక దేవయ్య మాదిగ, ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక గౌరవాధ్యక్షుడు ఎం.విజయ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ రామలక్ష్మణ్, ఉత్సవాల కమిటీ చైర్మన్ నరేంద్ర మాదిగ, దళిత నాయకుడు బేబీ రాజు సహా పలువురు పాల్గొన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications