తెలంగాణకు సుప్రీంకోర్టులో రిలీఫ్: పాలమూరు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్, 500 కోట్ల జరిమానాపై స్టే
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతిచ్చింది.
హైదరాబాద్: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతిచ్చింది. పర్యావరణ అనుమతులు 7.15 టీఎంసీల ఉపయోగించుకోవడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే, తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని సర్వోన్నత న్యాయ స్థానం స్పస్టం చేసింది. ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కోకుండా.. ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశంతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ సంజవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

మరోవైపు, పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటీ జరిమానా విధిస్తూ.. ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింంది. ఈ కేసులో ఉన్న ప్రతివాదులందరికీ సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆరువారాల్లో ప్రతివాదులు అంతా.. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆ తర్వాత ఆరువారాల్లో వాటికి సమాధానంగా రిజాయిండర్లు దాఖలు చేయాలని పటిషనర్ ను ఆదేశించింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రైబ్యునల్ విధించిన రూ. 500 కోట్ల జరిమానాపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి విచారణను ఆగస్టులో చేపట్టనున్నట్లు తెలిపింది.
కాగా, 35,200 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో 1.5 శాతం అంటే రూ. 528 కోట్ల పర్యావరణ పరిహారాన్ని విధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
-
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications