'వైర్ లెస్' సిటీగా హైదరాబాద్.. అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ వేగవంతం
విద్యుత్ శాఖ పై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో SPDCL, NPDCL తో పాటు మరో కొత్త డిస్కం ఏర్పాటు చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించగా.. దీనికి సంబంధించి ప్రాథమిక ప్రణాళికను అధికారులు వివరించారు.
వ్యవసాయం, మేజర్, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా , జీహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదన పై చర్చించారు. డిస్కంల పునర్విభజన తర్వాత PPA అలొకేషన్, సిబ్బంది, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేబినెట్ ఆమోదం అనంతరం కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకెళ్లాలని ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై పలు ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు. డిసెంబరులోగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించి, వచ్చే రెండున్నరేళ్లలో కోర్ అర్బన్ రీజియన్ లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఓవర్ లోడ్ సమస్యలు తలెత్తకుండా కోర్ అర్బన్ రీజియన్ లో విద్యుత్ సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ లో ఎక్కడెక్కడ కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల అవసరం ఉందో గుర్తించి, ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
మరోవైపు విశ్వనగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు వీధుల్లో వేలాడుతున్న ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లను తొలగించి, భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరుగుతోంది. ఓవర్ హెడ్ కేబుల్స్ లేకుండా చేసేందుకు గ్రేటర్ పరిధిలో ఒక్కో సెక్షన్కు రూ.100 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని నిర్ణయించారు.
-
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications