ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
కొమురంభీం: కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెబ్బెన మండలం సోనాపూర్ వద్ద వంతెన పైనుంచి బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
కైరిగూడ ఆర్చ్ నుంచి కైరిగూడ ఓపెన్ కాస్ట్ వైపు వెళ్తున్న బోలెరో వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి బోల్తా పడింది. ప్రమాదానికి గురైన వాహనం సింగరేణి సంస్థలో పనులు నిర్వహించే వాహనంగా గుర్తించారు.
మృతదేహాలను అసిఫాబాద్ తరలించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, వారి బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఇద్దరి ప్రాణం తీసిన వేగం
అతివేగం కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. లారీ రూపంలో వచ్చిన మృత్యువు జాగ్రత్తగా వెళ్తున్న వారి ప్రాణాలను తీసింది. చెన్నూరు మండలం చింతలపల్లి బతుకమ్మవాగు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వరిగడ్డిని తరలిస్తున్న ట్రాక్టర్ను వెనకాల నుంచి లారీ వచ్చి ఢీకొట్టడంతో రాంశెట్టి రాజబాపు(28), గడిపెల్లి బానయ్య(38) మృతి చెందారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications