Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఘోర రోడ్డు ప్రమాదం: మాజీ డీజీపీ పేర్వారం మనవడి దుర్మరణం (ఫోటోలు)

హైదరాబాద్: నగరంలోని ఔటర్ రింగు రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మరో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. వీరిలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పనిచేసి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ఉన్న పేర్వారం రాములు మనవడు వరుణ్ పవార్ దుర్మరణం పాలయ్యారు.

బుధవారం ఉదయం రాజేంద్రనగర్‌ మండలం కోకాపేట వద్ద స్కోడా కారు ముందుగా వెళుతున్న మిల్క్ వ్యాన్‌ను వేగంగా దూసుకువచ్చిన ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వివరాల్లోకి వెళితే ఈ స్కోడా కారులో వరుణ్‌పవార్, మరో నలుగురు కలసి గచ్చిబౌలి నుంచి కారులో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్నారు.

 ఔటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: మాజీ డీజీపీ పేర్వారం మనవడి దుర్మరణం

ఔటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: మాజీ డీజీపీ పేర్వారం మనవడి దుర్మరణం


బుధవారం ఉదయం రాజేంద్రనగర్‌ మండలం కోకాపేట వద్ద స్కోడా కారు ముందుగా వెళుతున్న మిల్క్ వ్యాన్‌ను వేగంగా దూసుకువచ్చిన ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

 ఔటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: మాజీ డీజీపీ పేర్వారం మనవడి దుర్మరణం

ఔటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: మాజీ డీజీపీ పేర్వారం మనవడి దుర్మరణం

వివరాల్లోకి వెళితే ఈ స్కోడా కారులో వరుణ్‌పవార్, మరో నలుగురు కలసి గచ్చిబౌలి నుంచి కారులో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్నారు.

ఔటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: మాజీ డీజీపీ పేర్వారం మనవడి దుర్మరణం

ఔటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: మాజీ డీజీపీ పేర్వారం మనవడి దుర్మరణం


కోకాపేట సమీపంలో వేగంగా వెళ్తున్న వారి కారు ముందుగా వెళ్తున్న పాల వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న వరుణ్‌తో పాటు జ్ఞానదేవ్, పవన్ అక్కడికక్కడే మృతిచెందారు.

 ఔటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: మాజీ డీజీపీ పేర్వారం మనవడి దుర్మరణం

ఔటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: మాజీ డీజీపీ పేర్వారం మనవడి దుర్మరణం


సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు డీజీపీగా పని చేసిన పేర్వారం రాములు కుమార్తె కొడుకే వరుణ్ పవార్

 వరంగల్ డీసీసీ అధ్యక్షుడి కుమారుడు మృతి

వరంగల్ డీసీసీ అధ్యక్షుడి కుమారుడు మృతి


హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి కుమారుడు విశాల్ రెడ్డి మృతి చెందారు. క్రాస్ రోడ్స్ వద్ద ఉదయం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి.

 వరంగల్ డీసీసీ అధ్యక్షుడి కుమారుడు మృతి

వరంగల్ డీసీసీ అధ్యక్షుడి కుమారుడు మృతి


ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న విశాల్ రెడ్డి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. విశాల్ రెడ్డి నగరంలోని కేఎమ్ ఐటీ లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కుమారుడి మరణవార్త తెలిసి రాజేందర్ రెడ్డి సంఘటనా స్థలికి బయల్దేరి వెళ్లారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+