నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం... నలుగురు మృతి, ఇద్దరికి విషమం !!
తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాలో ఈరోజు ( మంగళవారం, జనవరి 20) తెల్లవారుజామున హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. స్థానిక బస్ డిపో సమీపంలో వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో ఈ రోడ్డు ప్రమాదం విషయం సర్వత్రా తీవ్ర విషాదం నింపుతోంది.
కాగా మృతులను బాబన్న, భోజరాం పటేల్, రాజన్న, వికాస్ గా గుర్తించారు. వీరంతా నిర్మల్ జిల్లా కుబేర్ మండలం కుప్టి గ్రామానికి చెందినవారని చెబుతున్నారు. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు కారులో హైదరాబాద్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. క్షతగాత్రుల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గంగాధర్ ఉన్నారు. ప్రయాణం ఇలా విషాదాంతంగా మారడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. తెల్లవారుజామున రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ, ప్రమాద సమాచారం తెలియగానే స్థానికులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో కొంతసేపు భైంసా-నిర్మల్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ముందుగా భైంసా ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిర్మల్ లేదా హైదరాబాద్కు తరలించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదం అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్తో పాటు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో కుప్టి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక్కసారిగా నలుగురు యువకులు మృతి చెందడంతో గ్రామస్తులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు రాత్రి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, అధిక వేగాన్ని నివారించాలని పోలీసులు వాహనదారులకు మరోసారి సూచించారు.
-
రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పవర్ వినియోగంపై డిప్యూటీ సీఎం పవర్ఫుల్ కామెంట్స్! -
నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ.. కీలక భేటీ ! -
IND Vs ENG: సెమీస్ వర్షంలో కొట్టుకుపోతే, ఫైనల్ చేరేదెవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
T20 World Cup ఫైనల్ వీరి మధ్యే..! తేల్చేసిన ఏఐ ప్లాట్ ఫామ్స్..! -
Ind Vs Eng: సెమీస్ లో స్టార్ బ్యాటర్ పై వేటు, డేంజెరస్ హిట్టర్ ఇన్ - మార్పుల వెనుక..!! -
హోలీ ఎప్పుడు? మార్చి 3 లేదా 4నా - స్కూల్స్.. బ్యాంకుల సెలవుపై తాజా నిర్ణయం..!! -
వారి రేషన్ కార్డులు రద్దు, జాబితా సిద్దం - అనూహ్య నిర్ణయం..!! -
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, వారికి కేటాయింపు - పంపిణీ ముహూర్తం..!! -
దుబాయ్ లో ఇరుక్కుపోయిన తెలంగాణా మంత్రి.. పరిస్థితి ఇలా! -
T20 World Cup 2026: పాక్ ఆటగాళ్లకు పీసీబీ భారీ జరిమానా! -
పాకిస్థాన్పై డ్రోన్ దాడి.. ఎయిర్బేస్ లక్ష్యంగా భీకర దాడులు! -
నాడు సంజూ పై సూర్య వెటకారం, ఇప్పుడు టోపీ తీసి సెల్యూట్..!!












Click it and Unblock the Notifications