TSRTC: మహిళలకు టీఎస్ ఆర్టీసీ షాక్.. ఇక నుంచి ఆ బస్సుల్లో ఛార్జీల వసూల్..!
తెలంగాణ ప్రభుత్వ మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు భారీగా వాడుకుంటున్నారు. బస్సుల్లో తెగ ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం మహిళలకు ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకాశం ఉంది. ఇక సిటీ బస్సుల విషయానికొస్తే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ లో ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఉచితం ఉంది కదా అని చాలా మంది మహిళలు అనవసరంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ముఖ్యంగా దూరం వెళ్లే ఎక్స్ ప్రెస్ ల్లో ఎక్కి ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆర్టీసీ అధికారులు మహిళలకు విజ్ఞప్తులు చేశారు. అనవసరంగా ఎక్స్ ప్రెస్ లు ఎక్కొద్దని కోరారు. పల్లె వెలుగు బస్సులు వాడుకోవాలని సూచించారు. అయితే మహిళలకు ప్రత్యేక బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించారు. మొన్న సంక్రాంతికి ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఈసారి మేడారం కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.

ఈ ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని చాలా భావించారు. కానీ ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తొలగించి ఛార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. ఇటీవల రవాణా శాఖ బడ్జెట్ పై చర్చించడానికి డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు వసూలు చేయడం వల్ల కాస్త ఆదాయం పెరుగుతోందని అధికారులు ప్రతిపాదిచారు.
భట్టి అధికారుల ప్రతిపాదనను తిరస్కరించారు.మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు.మేడారం సహా ఏ జాతరకైనా మహిళలకు ఛార్జీలు వసూలు చేయొద్దని స్పష్టం చేశారు. ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తేల్చి చెప్పారు. ఆర్టీసీ మేడారం జాతరకు భారీగా ప్రత్యేక బస్సులు నడపనుంది. ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. మేడారం జాతర కోసం ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులు నడపనుంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications