తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీం షాక్- కోర్టు ధిక్కారంపై..!
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఇవాళ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో కోర్టు ధిక్కార చర్యల విషయంలో ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడంపై ఆ పార్టీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదులు చేసింది. అయితే వీటిని నిర్ణీత గడువులోగా విచారించి తగు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా చర్యలు తీసుకోకపోవడంతో కోర్టు ధిక్కారానికి స్పీకర్ పాల్పడ్డారంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తమ ఆదేశాల్ని పాటించకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. గతంలో ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్ తో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ను కూడా జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

ఇప్పటికే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా కేవలం ఏడుగురిపైనే స్పీకర్ తీర్పు ఇచ్చారు. దీంతో సుప్రీంకోర్టు తాజాగా ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేేసింది. రెండు వారాల్లోగా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసింది. ఈ మేరకు ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు 8 వారాల గడువు ఇవ్వాలన్న స్పీకర్ కార్యాలయం విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చింది. అయితే స్పీకర్ కంటికి ఆపరేషన్ చేయించుకోవడం, అసెంబ్లీ సమావేశాల వంటి కారణాలతో గడువు పెంచాలని కోరగా. 2 వారాల విచారణలో పురోగతి చూపిస్తే నాలుగు వారాలు ఇస్తామని సూచించింది. ఇప్పుడు గత డెడ్ లైన్ ఉల్లంఘన విషయంలో కోర్టు ధిక్కార చర్యలపై నోటీసు జారీ చేసింది.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications