తెలంగాణలో పాఠశాల వేసవి సెలవులు పొడిగింపు: ఇంటర్ సెకండీయర్ ఫలితాల వెల్లడికి కసరత్తు
హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు మరో ఐదు రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పొడిగించిన వేసవి సెలవులు మంగళవారంతో ముగిశాయి. దీంతో జూన్ 20 వరకు సెలవులను పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ జూన్ 19 వరకు లాక్డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే వేసవి సెలవులను పొడిగించినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. జులై 1 నుంచి ఆన్లైన్ తరగతులతో విద్యా సంవత్సరం ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం.

కాగా, ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. మొదటి సంవత్సరం విద్యార్థులను ఇప్పటికే సెకండీయర్కు ప్రమోట్ చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఇది ఇలావుండగా, తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను వెల్లడించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఫలితాల వెల్లడి కోసం అనుసరించాల్సిన విధి విధానాలను కమిటీ రూపొందించింది. కమిటీ సిఫార్సులతో కూడిన నివేదికను మంగళవారం ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రభుత్వానికి సమర్పించారు. కాగా, మొదటి సంవత్సరం మార్కులను ప్రామాణికంగా తీసుకుని.. రెండో సంవత్సరం మార్కులు వేయాలని కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిన వారం పది రోజుల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications