'దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితులు తప్పించుకునేందుకు స్కెచ్..'
నిందితులు తప్పించుకునే అవకాశముందని హెచ్చరిస్తూ కేంద్ర ఇంటలిజెన్స్ ఎన్ఐఏను అప్రమత్తం చేశాయి.
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక ఫాస్ట్ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న ఈ ఐదుగురు నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇంటలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ఒక్కసారి పోలీస్ యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనికి తోడు రిపబ్లిక్ వేడుకలు కూడా దగ్గర పడుతుండటంతో నగరంలోను భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నారు.

నిందితులు తప్పించుకునే అవకాశముందని హెచ్చరిస్తూ కేంద్ర ఇంటలిజెన్స్ ఎన్ఐఏను అప్రమత్తం చేశాయి.దీంతో నిందితులు ఉన్న మంజీరా బ్యారెక్ వద్ద ఎన్ఐఏ అదనపు భద్రత ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాలు, కేంద్ర బలగాలతో అదనపు భద్రత ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications