ఆత్మహత్య చేసుకొంటూ సెల్పీ తీసుకొన్నాడు
హైదరాబాద్ : స్మార్ట్ పోన్ల వినియోగం పెరిగిపోయిన తర్వాత సెల్పీల పై మోజు కూడ పెరిగింది. ప్రతి చిన్న విషయానికి సెల్పీలు దిగడం పరిపాటిగా మారింది.ఇప్పటివరకు సంతోషకరమైన కార్యక్రమాలకే సెల్పీలను వినియోగించుకొనేవారు. కాని, హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఆత్మహాత్యచేసుకొంటూ సెల్పీ తీసుకొన్నాడు.
సెల్పీ కోసం ప్రాణాలు పోగొట్టుకొన్న ఘటనలు చూశాం. విన్నాం కాని, హైదరబాద్ లో మాత్రం ఆత్మహాత్య చేసుకొంటూ సెల్పీ దిగిన ఘటన వినూత్నంగా కన్పిస్తోంది.ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహాత్యకు పాల్పడ్డాడని చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులు చెబుతున్నారు.
హైదరాబాద్ రామంతపూర్ లో క్రాంతి కుమార్ నివాసం ఉంటున్నాడు. ఈయన క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.కొద్ది కాలం నుండి ఆర్థిక ఇబ్బందులతో ఈయన బాదపడుతున్నాడు.ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే మార్గం లేక ఆయన చనిపోవాలని నిర్ణయం తీసుకొన్నాడు. ఆత్మహాత్య చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చని ఆత్మహాత్యకుపాల్పడ్డాడు.
భార్య పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహాత్య చేసుకొన్నాడు క్రాంతికుమార్. అయితే ఆత్మహాత్య చేసుకొనే ముందుకు ఆయన సెల్పీ తీసుకొన్నాడు ఉరివేసుకొంటున్న తీరును మొత్తం సెల్పీ ద్వారా చిత్రీకరించాడు. అసలే ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబం కుటుంబ యజమాని చనిపోవడంతో మరింత కష్టాలపాలైంది.