వ్యభిచార గృహంపై దాడి: నిర్వాహకురాలితోపాటు 21మంది అరెస్ట్
హైదరాబాద్: ఎవరికీ అనుమానం రాకుండా వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. నిర్వాహకులతో పాటు 14మంది విటులు, ఏడుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే.. నాచారం పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమ వెనుకవైపు గుడిసెల్లో వ్యభిచారం నడుస్తున్నట్లు తెలియడంతో ఎస్వోటీ ఎస్ఐ రాములు నేతృత్వంలో ఆదివారం దాడి చేశారు.
దాడిలో రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకురాలితో పాటు 21మందిని అరెస్టుచేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మైనర్కు లైంగిక వేధింపులు
ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప్పుగూడకు చెందిన అజితకుమార్ కొద్దిరోజులుగా ఓ యువతి(16)ను వెంబడిస్తూ ప్రేమిం చాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఒప్పు కోకపోవడంతో బెదిరించాడు.
బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిర్బయచట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. యువతిని భరోసా కేంద్రానికి తర లించారు. రెండు రోజుల తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన అజితకుమార్ తిరిగి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో నిందితుడి బెయిల్ రద్దు చేయా ల్సిందిగా కోర్టును కోరనున్నట్టు డీసీపీ తెలిపారు. ఛత్రినాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.