కోర్కె తీర్చాలంటూ సహోద్యోగి వేధింపులు: ప్రిన్సిపాల్ ఆత్మహత్య
హైదరాబాద్: విద్యార్థులకు విద్యా, బుద్ధులు చెప్పి, మంచి మార్గంలో నడిపించాల్సని ఓ ఉపాధ్యాయుడు కీచకుడిలా మారి పాఠశాల మహిళా ప్రిన్సిపాల్ను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అతడి వేధింపులు భరించలేక ఆ ప్రిన్సిపాల్ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నగరంలోని పుప్పాలగూలో చోటు చేసుకుంది.
నార్సింగి ఎస్ఐ ధనంజయ్ కథనం ప్రకారం...లంగర్హౌస్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న శ్రీలత(36) భర్త రవీందర్, కొడుకు(10)తో కలిసి పార్శిగుట్టలో నివసిస్తోంది.
ఆమె పనిచేస్తున్న పాఠశాలలోనే రాపోలు శ్రీధర్(38) ప్రిన్సిపల్(అడ్మిన్)గా పనిచేస్తున్నాడు. కాగా, తన లైంగిక కోర్కెలు తీర్చాలంటూ శ్రీలతను కొంత కాలంగా శ్రీధర్ వేధిస్తున్నాడు. అంతేగాక, బయటకు చెబితే ఉద్యోగం తీయిస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో అతని వేధింపులకు విసిగిపోయిన శ్రీలత సోమవారం నెక్నాంపూర్ అల్కాపూర్ కాలనీలో ఉంటున్న సోదరుని ఇంటికి వచ్చి అర్ధరాత్రి బాత్రూం కిటికీ గ్రిల్స్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా, మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు గమనించారు. శ్రీధర్ వేధింపులతోనే తమ సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి సోదరుడు సంతోష్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శ్రీధర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications