Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సలహాలు నచ్చనోడికి సలహాదురుడు కావాలా.?సీఎం, సోమేష్ బంధంపై భగ్గుమన్న షర్మిళ.!

హైదరాబాద్ : ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వాన్ని మరొక్కసారి ఘాటుగా విమర్శించారు వైయస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకని, ఒక వేళ సలహాలు ఇస్తే చెవిటోని ముందు శంఖం ఊదినట్లు ఉంటుందని వైఎస్ షర్మిల సీఎం చంద్రశేఖర్ రావును విమర్శించారు. నియంత నిర్ణయాలతో తెలంగాణను భ్రష్టు పట్టించారని,ఒంటెద్దు పోకడతో తెలంగాణను సర్వనాశనం చేశాని సీఎం చంద్రశేఖర్ రావు పై షర్మిళ ధ్వజమెత్తారు.

ప్రజల కష్టాలు పట్టని కేసీఆర్ : ప్రజల గోస వినే కమిషన్లకు ఆఫీసర్లు లేరు కానీ దొరకు దోచిపెట్టే సలహాదారులను పక్కనచేర్చోబెట్టుకున్నారని మండి పడ్డారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు కానీ పక్కరాష్ట్రాల మందికి లక్షలు జీతమిచ్చి మేపుతున్నారని, తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ సీఎంకు ఆయన పార్టీ బీఆర్ఎస్ కి పని చేస్తున్నారన్నారు షర్మిళ.

 yssharmila2
సలహాదారుడుగా సోమేష్ ఎందుకు : ఇంతకూ సోమేష్ కుమార్ లాంటి సలహాదారులు రుణమాఫీ అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేయమని సలహా ఇచ్చేవాళ్లా? పేదలకు ఇండ్లు కట్టి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? రైతుబీమా అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? పోడు పట్టాలు, నిరుద్యోగ భృతి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? ఇచ్చేవాళ్లు అయితే వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? చంద్రశేఖర్ రావు ఎందుకు పట్టించుకోలేదు? సమాధానం చెప్పండని సీఎంను వైయస్ షర్మిళ నిలదీసారు.

తడిసిన ధాన్యాన్ని కొంటారా.?కొనరా : అకాల వర్షాలకు వడ్లు మొలకెత్తి ఓ కౌలు రైతన్న ప్రాణం పోయిందని, చనిపోతానని ముందే చెప్పినా కూడా ఆదుకోని అసమర్థ ప్రభుత్వం చంద్రశేఖర్ రావుదని షర్మిళ విరుచుకుపడ్డారు. కండ్లు ఉన్నా చూడలేని, చెవులు ఉన్నా వినలేని ప్రభుత్వమిదని, రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు మాత్రం వద్దా అని నిలదీసారు. తొమ్మిదేళ్లలో తొమ్మిది వేల మంది రైతులను బలి తీసుకున్నారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసారు షర్మిళ.

 yssharmila2

పంటభీమా ఎందుకు ఇవ్వరు : అంతే కాకుండా మరో రైతు ప్రాణం తీసుకోకముందే ఇచ్చిన మాట ప్రకారం ఆఖరి గింజ వరకూ కొనాలని షర్మిళ డిమాండ్ చేసారు. ఐకేపీ సెంటర్లు అన్ని తెరువాలని, క్వింటాలుకు 12 కిలోల తరుగు దోపిడీ ఆపాలని, తడిసిన వడ్లు సైతం కొనాలపి, ఇచ్చిన హామీ ప్రకారం కనీసం 10 వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలపి షర్మిళ డిమాండ్ చేసారు.ఇప్పటికే 2023లో దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా, పంట బీమా కూడా లేని దిక్కుమాలిన పాలన చంద్రశేఖర్ రావుదని షర్మిళ మండి పడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+