గన్ పార్క్ లో గర్జించిన షర్మిళ.!సీఎం కు10ప్రశ్నలు సంధించిన వైయ్యస్సార్ టీపి అధినేత్రి.!

హైదరాబాద్ : తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలను సీఎం చంద్రశేఖర్ రావు మోసం చేస్తూనే ఉన్నారని, 4.5లక్షల కోట్ల అప్పుల కుప్పగ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చారని వైయస్సార్ టీపీ అధినేత్రి, వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేసారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద లక్షన్నర కోట్లు సీఎం దోచుకున్నారని, మిషన్ భగీరథ పేరుతో మరో దోపిడీ జరిగిందని, దోచుకున్న సొమ్ముతో బీఆర్ఎస్ పార్టీ పెట్టి, పార్లమెంట్ ఎన్నికలకు సైతం ఫైనాన్స్ చేసే స్థాయికి ఎదిగారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు వైఎస్ షర్మిల. దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునే ముందు తను సంధిస్తున్న 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.

నిరుద్యోగులకు న్యాయం జరిగిందా : అంతే కాకుండా తెలంగాణ వచ్చాక 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సీఎంచంద్రశేఖర్ రావు చెప్పాలని డిమాండ్ చేసారు వైఎస్ షర్మిల. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన హామీ ఏమయ్యిందని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని,రుణమాఫీ అని రైతులను మరో మోసం చేసారని, తెలంగాణలో 36 లక్షల మందికి సొంత ఇళ్లులు లేవని, చంద్రశేఖర్ రావు కేవలం 26 వేల ఇండ్లు ఇస్తే, 36 లక్షల మందికి న్యాయం చేసినట్లా అని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా మోసం చేయడంతో పాటు, దళిత బందులోని నిధులను సగం ఎమ్మెల్యేలు కాజేస్తున్నారని మండిపడ్డారు.

 sharmila-
ప్రత్యేక తెలంగాణలో ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదు : తెలంగాణ వచ్చిన తర్వాత ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదని, 10 ఎండ్లలో ఏదో ఉద్ధరించినట్లు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని, ఎందుకోసం ఉత్సవాలు, ఏం సాధించారని ఉత్సవాలు నిర్వహిస్తున్నారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. చంద్రశేఖర్ రావుకి దమ్ముంటే తాము సంధిస్తున్నా 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. దళిత ముఖ్యమంత్రి హామీ ఏమయ్యిందని, 2014 నుంచి 2023 వరకు 30 వేల ఎకరాల భూములు అమ్మిన మాట నిజం కాదా అని నిలదీసారు. కోటి ఎకరాల మాగాణి ఇస్తామని చెప్పి ఎన్ని ఎకరాలకు సాగు నీరు ఇచ్చారని, కేజీ టూ పీజీ ఉచిత విద్యుత్ హామీ ఎక్కడ పోయిందని, రైతులు కోటేశ్వరులు అయితే 9 వేల మంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ షర్మిల నిలదీసారు.

 sharmila-
కేసీఆర్ కు కాంగ్రెస్ సప్లై కంపెనీ : ఇదిలా ఉండగా తెలంగాణలో అమర వీరుల పరిస్థితి ఎంటిని చంద్రశేఖర్ రావును నిలదీసారు. తెలంగాణ పేరుతో ప్రాంతీయ పార్టీ ఉండటం ఇష్టం లేదా అంటూ, ప్రాంతీయ పార్టీలు ఉంటే జాతీయ పార్టీలో విలీనం చేయాలా..? వైయస్సార్ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టీ రెండేళ్లు అవుతుందని, తెలంగాణలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇంతకాలం చంద్రశేఖర్ రావు మోచేతి నీళ్ళు తాగాయని మండి పడ్డారు. జాతీయ పార్టీలు సరిగా పనిచేయనందుకే వైయస్సార్ తెలంగాణ పార్టీ ప్రజల సమస్యల మీద కొట్లాడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం చంద్రశేఖర్ రావుకి సప్లయ్ కంపెనీగా మారిందని షర్మిళ ఎద్దేవా చేసారు.

 sharmila-
అమరవీరుల సాక్షిగా కేసీఆర్ తో పొత్తు అనేది ఉండదు : 2018 లో కాంగ్రెస్ 19 సీట్లు గెలుస్తే 14 మంది గులాబీ పార్టీలోకి మారిపోయారని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కారు గుర్తుకు ఓటు వేసినట్లేనని, అమ్ముడు పోయే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందన్నారు షర్మిళ. ఎలక్షన్ తర్వాత చంద్రశేఖర్ రావుకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా లేదా చెప్పాలన్నారు. ఈ సారి చంద్రశేఖర్ రావుకు 30 సీట్లు కన్నా ఎక్కువ రావనన్నారు షర్మిల. అన్ని పార్టీలు చంద్రశేఖర్ రావు కు వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టత ఇవ్వాలని, అప్పుడే పొత్తులకు సంబంధించి ఆలోచన చేస్తామన్నారు షర్మిళ. అమరవీరుల సాక్షిగా చంద్రశేఖర్ రావుతో పొత్తు అనేది ఉండదన్నారు వైయస్ షర్మిళ.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+