షాకింగ్ రిజల్ట్స్... ఆ యూనివర్సిటీలో 105 మంది విద్యార్థుల్లో ఒక్కరే పాస్
రాష్ట్రంలో వైద్య విద్య కోర్సులను నిర్వహించే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. వర్సిటీ ప్రారంభించి నాలుగున్నర ఏళ్లకుపైగా కావస్తున్నా.. కనీస స్థాయిలో పరిపాలన వ్యవహారాలు జరగడంలేదు. ఇక బోధన సైతం అంతంత మాత్రమే అని చెప్పడానికి ఇటీవల నిర్వహించిన మెడికల్ పీజీ ఫస్టియర్ ఫలితాలే ఒక తార్కాణం.

105 మంది విద్యార్థుల్లో ఒక్కరే పాస్
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడింది కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ. పేరుకు యూనివర్సిటీ గా ఉన్న యూనివర్సిటీ లో ఉండాల్సిన వసతులు కానీ, పరిపాలనా వనరులు కానీ, సిబ్బంది కానీ ఇక్కడ లేరు. దీంతో వైద్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన మెడికల్ పీజీ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో 105 మంది పీజీ విద్యార్థులకు గాను 98 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే తాజాగా వెలువరించిన ఫలితాలలో ఒక్కరంటే ఒక్కరు పాస్ అయినట్లుగా ఫలితాలు చేయడంతో విద్యార్థులు షాక్ అయ్యారు. తాము పరీక్షలు బాగా రాశాము అని చెబుతున్న విద్యార్థులు పరీక్షల విభాగం ప్రకటించిన ఫలితాలను చూసి ఆవేదనకు గురయ్యారు.

పీజీ పరీక్షా ఫలితాలపై విద్యార్థులు మౌన నిరసన
దీంతో వరంగల్ లోని యూనివర్సిటీ ప్రధాన భవనం వద్ద పీజీ విద్యార్థులు మౌనంగా తమ నిరసనను తెలియజేశారు. ప్రశ్నా పత్రాల మూల్యాంకనం లో తప్పు జరిగిందా, లేకా ఫలితాల విడుదల సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తాయా .. మరి ఏ ఇతర కారణాలు ఉన్నాయి అన్నదానిపై విద్యార్థులు మల్లగుల్లాలు పడుతున్నారు.
విద్యార్థులు పరీక్షలు బాగా రాసినా ఫలితాలలో ఒక్కరంటే ఒక్కరు పాస్ కావడం ఇటు విద్యార్ధులనే కాదు, అటు యూనివర్సిటీలోని అధ్యాపకులను, తల్లిదండ్రులను సైతం అవాక్కయ్యేలా చేస్తోంది. ఒకవేళ నిజంగానే ఒక్క విద్యార్థి మాత్రమే పాస్ అయితే ఇంత మంది విద్యార్థులు ఫెయిల్ కావడానికి యూనివర్సిటీలోని బోధనా సిబ్బంది బాధ్యులు కారా అన్న ప్రశ్న తల్లిదండ్రుల్లో తలెత్తుతోంది. లేదంటే మూల్యాన్కనంలో తప్పు జరిగి వుంటుంది కాబట్టి తిరిగి పేపర్లను మూల్యాంకనం చెయ్యాలని కోరుతున్నారు.

గతంలోనూ పరీక్షల నిర్వహణలో పలు తప్పిదాలు
ఇటీవల మెడికల్ పరీక్షల నిర్వహణలో సైతం ఫార్మకాలజీ సబ్జెక్టుకు సంబంధించిన ఒక సెట్ బదులుగా మరో సెట్ ప్రశ్నాపత్రాలను ఇచ్చి విద్యార్థులను అయోమయానికి గురి చేయడమే కాకుండా తప్పు జరిగిందని నోరు కరుచుకున్న యూనివర్సిటీ అధికారులు ఆ పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అత్యంత క్లిష్టమైన వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు యూనివర్సిటీ తప్పిదాలతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని, ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలని కోరుతున్నారు. తమ భవిష్యత్తు తో ఆటలాడుకోవద్దు అని విన్నవిస్తున్నారు. మరి ఇంతకీ మెడికల్ పీజీ విద్యార్థుల ఫలితాల విషయంలో యూనివర్సిటీ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications