షాకింగ్ రిజల్ట్స్... ఆ యూనివర్సిటీలో 105 మంది విద్యార్థుల్లో ఒక్కరే పాస్
రాష్ట్రంలో వైద్య విద్య కోర్సులను నిర్వహించే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. వర్సిటీ ప్రారంభించి నాలుగున్నర ఏళ్లకుపైగా కావస్తున్నా.. కనీస స్థాయిలో పరిపాలన వ్యవహారాలు జరగడంలేదు. ఇక బోధన సైతం అంతంత మాత్రమే అని చెప్పడానికి ఇటీవల నిర్వహించిన మెడికల్ పీజీ ఫస్టియర్ ఫలితాలే ఒక తార్కాణం.

105 మంది విద్యార్థుల్లో ఒక్కరే పాస్
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడింది కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ. పేరుకు యూనివర్సిటీ గా ఉన్న యూనివర్సిటీ లో ఉండాల్సిన వసతులు కానీ, పరిపాలనా వనరులు కానీ, సిబ్బంది కానీ ఇక్కడ లేరు. దీంతో వైద్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన మెడికల్ పీజీ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో 105 మంది పీజీ విద్యార్థులకు గాను 98 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే తాజాగా వెలువరించిన ఫలితాలలో ఒక్కరంటే ఒక్కరు పాస్ అయినట్లుగా ఫలితాలు చేయడంతో విద్యార్థులు షాక్ అయ్యారు. తాము పరీక్షలు బాగా రాశాము అని చెబుతున్న విద్యార్థులు పరీక్షల విభాగం ప్రకటించిన ఫలితాలను చూసి ఆవేదనకు గురయ్యారు.

పీజీ పరీక్షా ఫలితాలపై విద్యార్థులు మౌన నిరసన
దీంతో వరంగల్ లోని యూనివర్సిటీ ప్రధాన భవనం వద్ద పీజీ విద్యార్థులు మౌనంగా తమ నిరసనను తెలియజేశారు. ప్రశ్నా పత్రాల మూల్యాంకనం లో తప్పు జరిగిందా, లేకా ఫలితాల విడుదల సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తాయా .. మరి ఏ ఇతర కారణాలు ఉన్నాయి అన్నదానిపై విద్యార్థులు మల్లగుల్లాలు పడుతున్నారు.
విద్యార్థులు పరీక్షలు బాగా రాసినా ఫలితాలలో ఒక్కరంటే ఒక్కరు పాస్ కావడం ఇటు విద్యార్ధులనే కాదు, అటు యూనివర్సిటీలోని అధ్యాపకులను, తల్లిదండ్రులను సైతం అవాక్కయ్యేలా చేస్తోంది. ఒకవేళ నిజంగానే ఒక్క విద్యార్థి మాత్రమే పాస్ అయితే ఇంత మంది విద్యార్థులు ఫెయిల్ కావడానికి యూనివర్సిటీలోని బోధనా సిబ్బంది బాధ్యులు కారా అన్న ప్రశ్న తల్లిదండ్రుల్లో తలెత్తుతోంది. లేదంటే మూల్యాన్కనంలో తప్పు జరిగి వుంటుంది కాబట్టి తిరిగి పేపర్లను మూల్యాంకనం చెయ్యాలని కోరుతున్నారు.

గతంలోనూ పరీక్షల నిర్వహణలో పలు తప్పిదాలు
ఇటీవల మెడికల్ పరీక్షల నిర్వహణలో సైతం ఫార్మకాలజీ సబ్జెక్టుకు సంబంధించిన ఒక సెట్ బదులుగా మరో సెట్ ప్రశ్నాపత్రాలను ఇచ్చి విద్యార్థులను అయోమయానికి గురి చేయడమే కాకుండా తప్పు జరిగిందని నోరు కరుచుకున్న యూనివర్సిటీ అధికారులు ఆ పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అత్యంత క్లిష్టమైన వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు యూనివర్సిటీ తప్పిదాలతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని, ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలని కోరుతున్నారు. తమ భవిష్యత్తు తో ఆటలాడుకోవద్దు అని విన్నవిస్తున్నారు. మరి ఇంతకీ మెడికల్ పీజీ విద్యార్థుల ఫలితాల విషయంలో యూనివర్సిటీ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications