Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘యాదగిరిగుట్ట’పైనా విచారణ జరుపుతాం: బీఆర్ఎస్ ఖాళీ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

భువనగిరి: గత ప్రభుత్వ పలు పథకాలు, పనులపై ఇప్పటికే విచారణ జరుగుతుండగా.. మరికొన్నింటిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.యాదగిరిగుట్ట నిర్మాణంపై విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్​ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి(Komatireddy Venkatreddy) మాట్లాడుతూ.. నాలుగు నెలల్లో ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజార్చారని ప్రతిపక్ష నేతలు కామెంట్స్​ చేస్తున్నారని.. కానీ, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని, కాంగ్రెస్​ ప్రభుత్వంతో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఆర్​ఆర్​ఆర్​ రోడ్డు నిర్మాణంలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా రహదారి నిర్మాణం ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్​ఎస్​ పార్టీ ఖాళీ అయిందని ధ్వజమెత్తారు.

state Govt will Investigate Construction of Yadagirigutta minister komatireddy venkat reddy

ఎన్నికల నోటిఫికేషన్​ రాబోతుందని అభివృద్ధి కార్యక్రమాలు ప్లాన్​ చేసుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం మొత్తం సంపదను దోచుకుని తిన్నదని బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. గత ప్రభుత్వం 6 వేల స్కూల్స్​ మూసి వేసిందని మండిపడ్డారు. కానీ, కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు వేశామని చెప్పుకొచ్చారు.

నిరుద్యోగుల కోసం గ్రూప్​ 1, డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు మంత్రి కోమటిరెడ్డి. పద్ధతి ప్రకారం ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయన్నారు. లోక్‌‍​సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని మంత్రి కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్​ పార్టీ అత్యధిక లోక్‌​సభ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 13 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందన్నారు. రెండు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ రాలేదని ధ్వజమెత్తారు.

ఆర్​ఆర్​ఆర్(RRR)​ అలైన్​మెంట్‌​పై మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపారు.
యాదగిరి గుట్ట దేవస్థానం నిర్మాణంపై కూడా విచారణ చేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్​ఎస్​ పార్టీ ఖాళీ అయిందని, ఆ పార్టీ వాళ్లే తమను అభినందిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలు లోక్‌​సభ ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్​ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ప్రజలు కచ్చితంగా గెలిపిస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+