కేసీఆర్కు ఝలక్: జంపింగ్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు గురువారం నాడు విచారణకు స్వీకరించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు, స్పీకర్కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ కురియన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇది సీఎం కేసీఆర్, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ అని చెప్పవచ్చు.

ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన గతంలో సంపత్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్, డివిజన్ బెంచ్లు అతని పిటిషన్ను కొట్టివేసింది. దీంతో సంపత్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
దీనిపై సంపత్ కుమార్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన స్పీకర్కు ఫిర్యాదు చేశానని పట్టించుకోలేదన్నారు. హైకోర్టుకు కూడా వెళ్లానని చెప్పారు. అక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టు గడప తొక్కానని చెప్పారు.
కాగా, తెలంగాణలో గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెరాస తరఫున 63 మంది గెలిచారు. టిడిపి నుంచి 15 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడెనిమిది మంది, టిడిపి నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కిన విషయం తెలిసిందే.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications