ఐసిసి చెరలో తెలుగువాళ్లు: టిడిపి నేత అత్యుత్సాహం, తెలంగాణ మీద పైచేయి కోసమే
హైదరాబాద్: లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న ఇద్దరు తెలుగువాళ్లకు ఇంకా విముక్తి లభించలేదు. తెలుగుదేశం పార్టీ నాయకుడు కంభంపాటి రామమోహన్ రావు అత్యుత్సాహం కారణంగా వారు విడుదలైనట్లు ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్తలతో ఐసిస్ చెరలో ఉన్న గోపీకృష్ణ కుటుంబ సభ్యులు సంబరాలు కూడా చేసుకున్నారు.
ఐసిస్ చెరలో ఉన్న ఇద్దరు కూడా హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం మీద పైచేయి సాధించాలనే ఉద్దేశంతో కంభంపాటి రామమోహన్ రావు వారి విడుదలపై సరైన సమాచారం లేకుండానే ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు.
ఉగ్రవాదుల చెరలో ఉన్న ఇద్దరు తెలుగువాళ్లు గోపికృష్ణ, బలరాం విడుదలైనట్లు తమకు లిబియాలోని భారత విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి సమాచారం అందిందని కూడా చెప్పారు. వారి విడుదలకు చొరవ చూపారంటూ ఆయన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను ప్రశంసించారు కూడా.
కంభంపాటి రామమోహన్ రావు కేంద్రం తరఫున మాట్లాడుతున్నారని తాను అనుకున్నానని, ఆయన ప్రకటనతో తాను అయోమయానికి గురయ్యానని, తాను లిబియాలోని దౌత్యకార్యాలయానికి ఫోన్ చేశానని, వారు విడుదలైనట్లు తమకు ఏ విధమైన సమాచారం లేదని వారు చెప్పారని బలరాం భార్య శ్రీదేవి చెప్పారు.

తాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో కూడా మాట్లాడానని, కిడ్నాపర్లతో చర్చలు జరుపుతున్నామని తమకు వారు చెప్పారని ఆమె వివరించారు. ఇద్దరి విడుదల కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నామని వారు చెప్పినట్లు శ్రీదేవి తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గోపీకృష్ణ ఓయూలో పీహెచ్డీ చేసి ఏడేళ్ల క్రితం లిబియాకు వెళ్లి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. గోపీకృష్ణ భార్య కళ్యాణి, కుమారుడు కృష్ణసాయి ఈశ్వర్(4), కుమార్తె జాహ్నవి(10)లతో కలిసి నాచారంలోని వీరారెడ్డి కాలనీలో నివాసముంటున్నారు.
కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన సి.హెచ్.బలరాం ఉస్మానియా యూనివర్సిటీలో ఆంగ్లంలో పీహెచ్డీ చేశారు. లిబియాలో సిర్తే వర్సిటీలో పనిచేయడానికి వెళ్లారు. ఆయన భార్య పిల్లలు శ్రీదేవి, విజయ్భాస్కర్, మధుసూధన్ అల్వాల్లోని సుభాష్నగర్లో నివాసముంటున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications