పదిరోజుల్లో తెలంగాణ సచివాలయం తరలింపుకు రంగం సిద్దం
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం కూల్చివేతకు రంగం సిద్దమైంది. రానున్న పది రోజుల్లో బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి కార్యాలయాలను తరలించాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.సీనియర్ ఐఎస్ అధిాకరులకు సచివాలయ భవనం తరలింపు భాద్యతలను అప్పగించారు సిఎస్.
తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని కెసిఆర్ తలపెట్టారు. అన్ని హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నారు.నగరంలోని 6 ప్రధాన కార్యాలయాల్లో సచివాలయంలోని ఆఫీసులను తరలించేందుకు అధికారులు ప్లాన్ చేశారు.

సచివాలయంలోని కార్యాలయాలను మాత్రం బూర్గుల రామకృస్ణారావు భవనంలోకి మార్చనున్నారు.
కొత్త సచివాలయాన్ని ఏడాది లోపుగా పూర్తి చేయాలని సిఎం భావిస్తున్నారు.వచ్చే మాసంలో సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బూర్గుల రామకృష్ణారావు భవనంలోని ప్రధానంగా అన్ని శాఖల కార్యదర్శులు, ప్రిన్సిఫల్ సెక్రటరీల కార్యాలయాను ఏర్పాటు
చేయనున్నారు.ఈ కార్యాలయాలతో పాటు అరణ్యభవన్, జలసౌద, పంచాయితీరాజ్ శాఖ, కార్యాలయాల్లో కూడ కొన్ని కార్యాలయాలను తరలించనున్నారు.
తెలంగాణ సచివాలయం ఆవరణలో ఉన్న ఎపి సచివాలయానికి కేటాయించిన భవనాలు కూడ తిరిగి స్శాధీనం చేసుకోనుంది తెలంగాణ.ఈ మేరకు మంత్రివర్గ తీర్మాణం కాపీని గవర్నర్ కు తెలంాణ సిఎం కెసిఆర్ అందించారు.ఎపి కూడ ఈ భవనాలను తిరిగి ఇచ్చేందుకు
సానుకూలంగా ఉంది.ఈ నేపథ్యంలోనే ఎపికి కేటాయించిన భవనాలను కూడ కూల్చివేయనుంది ప్రభుత్వం.
పది రోజుల్లో సచివాలయాన్ని ఖాలీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. సీనియర్ ఐఎఎస్ అధికారులు 9 మంది సచివాలయాన్ని ఖళీ చేసే భాద్యతను అప్పగించారు.పది రోజుల్లో సచివాలయంఖాళీ చేసేందుకు చర్యలను సర్కార్ తీసుకొనే అవకాశం teఉంది.












Click it and Unblock the Notifications