వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ మహిళా టెక్కీ బ్రెయిన్ డెడ్: అవయవాల దానం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తీవ్రమైన తలనొప్పితో ఓ మహిళా టెక్కీ మృత్యువాత పడింది. బాల్యం నుంచే కష్టపడి చదివి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఎదిగిన ఆ యువతిని అకాలంగా మృత్యువు పొట్టన పెట్టుకుంది. రంగారెడ్డి జిల్లా అంబర్‌పేట్‌లోని న్యూపటేల్‌నగర్‌కు చెందిన బి.దశరథ రాజు దంపతుల కుమార్తె బి. శిరీష.

ఆ 26 ఏళ్ల టెక్కీ 4పీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. నాలుగు రోజుల నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమెను హైదరాబాదులోని హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు హైడ్రోసిఫలస్ వ్యాధితో ఉందని, మెదడులో నీరు చేరిందన్నారు.

Techie Sirisha's organs donated after brain ead

చికిత్స నిర్వహిస్తుండగానే గురువారం బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు. తండ్రి దశరథరాజు, సోదరులు బి. యాదగిరి, లోకేశ్ రాజుకు అవయవదానం విశిష్టతపై వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో అవయవదానానికి ఒప్పుకున్నారు. శీరిష నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలను సేకరించారు.

English summary
A lady techie Sirisha's organs have been donated after her brain dead in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X