బీసీలకు అన్యాయం.. కేసీఆర్ను క్షమించరు.. అఖిలపక్షం భేటీలో ధ్వజమెత్తిన నేతలు
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్నిరకాలుగా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు ప్రాధాన్యం తగ్గించడం సరికాదన్నారు. పలు జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్ల కేటాయింపులో బీసీలకు ఒక్క సీటు కేటాయించకుండా మొండిచేయి చూపించారని ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై జరిగిన చర్చలో పలువురు నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీజేపీ సీనియర్ లీడర్, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ను బీసీలు క్షమించబోరని అన్నారు. బీసీల ఓట్లతో గెలిచి వారికి వెన్నుపోటు పొడవడం సరికాదన్నారు. రిజర్వేషన్ల సాధనకు బీసీలంతా ఐక్యమత్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బీసీ గణన చేయకుండానే ఎన్నికలకు సిద్ధం కావడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్టీలన్నీ ఏకతాటిపై ఉంటే బీసీ రిజర్వేషన్లు సాధించడం సులువు అవుతుందని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు సాధించేవరకు బీసీలు విశ్రమించొద్దని.. పోరాటం చేస్తేనే విజయం తథ్యమని వ్యాఖ్యానించారు.

-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications