కొలువుదీరనున్న తెలంగాణ అసెంబ్లీ..! రెండవసారి కూడా బలహీన ప్రతిపక్షమే..!!
హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల ఫలితాలు వెలువడిన సుధీర్గ కాలం తర్వాత తెలంగాణ శాసన సభ కొలువుతీర బోతోంది. గురువారం తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయబోతున్నారు. కొత్త పాత కలయికతో ఈ సారి అసెంబ్లీ కళకళలాడబోతోంది. అత్యంత సీనియర్ లు, తొలిసారి శాసన సభలో అడుగు పెట్ట బోతున్న వారికి సభ స్వాగతం పలకబోతోంది. ఐతే ప్రభుత్వ విధానాలను విమర్శించే ప్రతిపక్షం మాత్రం గతంలో కంటే ఈసారి మరింత బలహీనంగా ఉండడం విశేషం..! కొత్తగా కొలువు దీరుతున్న శాసనసభ కు సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం..!!

కొత్త అసెంబ్లీలో విశేషాలు..! పాత కొత్త కలయికలతో ఏర్పడనున్న శాసన సభ..!!
జనవరి 17 నుంచి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు తొలిరోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాలుగురోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలు సభ్యుల ప్రమాణ స్వీకారంతో ప్రారంభం అవుతాయి. అనంతరం స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో ముగియనున్నాయి. తెలంగాణా ఆవిర్భావం తర్వాత రెండోసారి తెలంగాణా శాసనసభ కొలువు దీరనుంది. డిసెంబర్ 11వ తేదీనే ఎన్నికల ఫలితాలు వెలువడ్డా, వివిధ కారణాలతో శాసనసభ కొలువుదీరలేదు.

ఉత్సాహంతో కొత్త ఎమ్మెల్యేలు..! ముస్తాబైన అసంబ్లీ..!!
సభలో మొత్తం సభ్యుల సంఖ్య 119తో పాటు ఒక అంగ్లో ఇండియన్ సభ్యుడు ఉంటారు. దీంతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 120, పార్టీల వారిగా సభ్యులు ఇలా ఉన్నారు.తెలంగాణా రాష్ట్ర సమితి - .88, కాంగ్రెస్ - 19, ఎంఐఎం -7,
టిడిపి-2, బిజెపి -1 కాగా సంతంత్రులు ఇద్దరు, వీరు అదికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇదిలా ఉండగా
శాసనసభలో సీనియర్ నేత, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అదికార పార్టీకి సంపూర్ణ మెజారిటి..! ఈసారి కూడా బలహీన ప్రతిపక్షమే..!!
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఉప సభాపతితో పాటు మరిన్నికీలక పదవులు నిర్వహించిన అనుభవం ఉంది.1985 నుంచి పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ గెలుపు సాధించారు.డబుల్ హ్యట్రిక్ సాధించిన ఎమ్మెల్యేలు గా ముంతాజ్ ఖాన్, ఎంఐఎం, ఎర్రబెల్లి దయాకర్ రావ్, టిఆర్ ఎస్, రెడ్యా నాయక్, టిఆర్ ఎస్ నుండి శాసర సభలో అడుగపెట్టబోతున్నారు. ఇక మొట్ట మొదటి సారి శాసనసభలో అడుగు పెడుతున్న ఎమ్మెల్యేల 23 మంది కాగా, గత అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు 76 మంది ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలుగా గెలుపొందిన మల్లారెడ్డి , బాల్క సుమన్ లు ఈసారి శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి, తొలిసారి శాసనసభలో అడుగు పెడుతున్నారు.

పదవులు ఎవరిని వరిస్తాయో..! ఆశావహుల్లో కొసాగుతున్న ఉత్కంఠ..!!
ఎమ్మెల్సీలుగా కొనసాగిన మైనంపల్లి హన్మంత్ రావ్, నరెందర్ రెడ్డిలు శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్ బుధవారం సాయంత్రం గవర్నర్ సమక్షంలో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం సభలో సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. శాసనసభలో శాసనసభ్యుడిగా కేసిఆర్ తో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలౌతుంది. కొత్తగా కొలువుదీరనున్న అసెంబ్లీ కావడంతో, అసెంబ్లీని కూడా ముస్తాబు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే అధికారులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications