తిరుమలలో తెలంగాణ భవన్, అసెంబ్లీలో మాజీ మంత్రి కీలక డిమాండ్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తెలంగాణకు ప్రాధాన్యత తగ్గుతుందా? రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు తమ సిఫార్సు లేఖలను కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి, ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసుకుని మరీ వీఐపీ దర్శనాలు పొందారు. దర్శనాల సంగతి కొలిక్కి వచ్చినా.. వసతి గదులు ఇబ్బంది ఉన్నాయంటూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కీలక డిమాండ్ తెరపైకి వచ్చింది.
తిరుమలకు వెళ్తే ఇబ్బందులు..!
రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు చెందిన వారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇబ్బందిగా మారిందని గత కొంతకాలంగా పలువులు ప్రజాప్రతినిధులు మీడియా ముందే తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రోటోకాల్ ఉన్న ప్రజాప్రతినిధులు మినహాఇస్తే వారికి అత్యంత ముఖ్యమైన వారికి ఇచ్చే సిఫార్సు లేఖల విషయంలో చాలా గందరగోళం నెలకొన్న తర్వాత టీటీడీ తెలంగాణ నేతల విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకుని వారికి కూడా సిఫార్సు లేఖలకు అవకాశం కల్పించింది. అయితే నిన్న అసెంబ్లీ సమావేశాలలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ తన ఆవేదనను సభకు తెలియజేశారు. తెలంగాణా నుంచి తిరుమలకు వెళ్ళిన ప్రజా ప్రతినిధులకు అయితే ఇబ్బందులే ఎదురవుతున్నాయని బాధను వ్యక్తం చేశారు.

శబరిమలలో 5 ఎకరాల్లో..
ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మించాలని సభకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటక వాళ్లకు అద్భుతమైన కర్ణాటక భవన్ ఉందని, తమిళనాడు వాళ్లకు కూడా భవన్ ఉందని.. తద్వారా వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారన తెలిపారు. తెలంగాణ భవన్ కూడా నిర్మిస్తే వసతి సౌకర్యాలు మెరుగవుతాయని అన్నారు. అలాగే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందన, సీఎం రేవంత రెడ్డి చొరవ తీసుకుని వెంటనే శబరిమలలో కూడా తెలంగాణ భవన్ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.
సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?
అయితే ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడా. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబుకు రిక్వెస్ట్ చేస్తారా.. లేక అసెంబ్లీలో తీర్మానం చేసి టీటీడీకి విజ్ఞప్తి చేస్తారా అనేది వేచి చూడాది. ఇరువురు సీఎంల మధ్య మంచి రిలేషన్స్ ఉన్న నేపథ్యంలో రాష్ట్రాలుగా విడిపోయినా తిరుమలకు తెలంగాణ నుంచి కూడా అధికంగా భక్తులు వస్తారు కాబట్టి తిరుమలలో తెలంగాణ భవన్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయాలని భక్తులు కూడా కోరుకుంటున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications