Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమలలో తెలంగాణ భవన్, అసెంబ్లీలో మాజీ మంత్రి కీలక డిమాండ్

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తెలంగాణకు ప్రాధాన్యత తగ్గుతుందా? రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు తమ సిఫార్సు లేఖలను కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి, ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసుకుని మరీ వీఐపీ దర్శనాలు పొందారు. దర్శనాల సంగతి కొలిక్కి వచ్చినా.. వసతి గదులు ఇబ్బంది ఉన్నాయంటూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కీలక డిమాండ్ తెరపైకి వచ్చింది.

తిరుమలకు వెళ్తే ఇబ్బందులు..!

రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు చెందిన వారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇబ్బందిగా మారిందని గత కొంతకాలంగా పలువులు ప్రజాప్రతినిధులు మీడియా ముందే తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రోటోకాల్ ఉన్న ప్రజాప్రతినిధులు మినహాఇస్తే వారికి అత్యంత ముఖ్యమైన వారికి ఇచ్చే సిఫార్సు లేఖల విషయంలో చాలా గందరగోళం నెలకొన్న తర్వాత టీటీడీ తెలంగాణ నేతల విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకుని వారికి కూడా సిఫార్సు లేఖలకు అవకాశం కల్పించింది. అయితే నిన్న అసెంబ్లీ సమావేశాలలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ తన ఆవేదనను సభకు తెలియజేశారు. తెలంగాణా నుంచి తిరుమలకు వెళ్ళిన ప్రజా ప్రతినిధులకు అయితే ఇబ్బందులే ఎదురవుతున్నాయని బాధను వ్యక్తం చేశారు.

Telangana Bhavan at Tirumala Demand Raised by Gangula Kamalakar in Assembly Winter Session

శబరిమలలో 5 ఎకరాల్లో..

ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మించాలని సభకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటక వాళ్లకు అద్భుతమైన కర్ణాటక భవన్ ఉందని, తమిళనాడు వాళ్లకు కూడా భవన్ ఉందని.. తద్వారా వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారన తెలిపారు. తెలంగాణ భవన్ కూడా నిర్మిస్తే వసతి సౌకర్యాలు మెరుగవుతాయని అన్నారు. అలాగే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందన, సీఎం రేవంత రెడ్డి చొరవ తీసుకుని వెంటనే శబరిమలలో కూడా తెలంగాణ భవన్ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.

సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?

అయితే ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడా. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబుకు రిక్వెస్ట్ చేస్తారా.. లేక అసెంబ్లీలో తీర్మానం చేసి టీటీడీకి విజ్ఞప్తి చేస్తారా అనేది వేచి చూడాది. ఇరువురు సీఎంల మధ్య మంచి రిలేషన్స్ ఉన్న నేపథ్యంలో రాష్ట్రాలుగా విడిపోయినా తిరుమలకు తెలంగాణ నుంచి కూడా అధికంగా భక్తులు వస్తారు కాబట్టి తిరుమలలో తెలంగాణ భవన్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయాలని భక్తులు కూడా కోరుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+