కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా: తన విజయంపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. స్పష్టమైన మెజార్టీ రావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజల తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా 100 రోజుల్లోనే అమలు చేసి తీరుతామన్నారు.
మరోవైపు, కొడంగల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 31,849 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై విజయం సాధించారు. కొడంగల్లో గెలుపుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy) ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటానని.. దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా నిలబెడతానని హామీ ఇచ్చారు రేవంత్.
కాగా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలకుపైగా గెలుపును నమోదు చేసింది. ఇప్పటి వరకు 64 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందగా.. మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ 33 స్థానాల్లో గెలుపొందగా.. మరో 6 స్థానాల్లో విజయం దిశగా సాగుతోంద. మరోవైపు, బీజేపీ 8 స్థానాల్లోనే గెలుపునకు పరిమితమైంంది. ఎంఐఎం ఏడు స్థానాల్లో విజయం సాధించింది.
ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.
— Revanth Reddy (@revanth_anumula) December 3, 2023
కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా.
ఈ గడ్డ పై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే… pic.twitter.com/v9hcZ4VpB3
ఇక, కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్ రావాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 4 సోమవారం లేదా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే, సీఎం ఎవరనే విషయంపై ఉత్కంఠ సాగుతోంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications