తెలంగాణా ఎన్నికలు: హెలికాఫ్టర్ లు, చార్టర్డ్ విమానాలకు డిమాండ్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేయడానికి రెడీ అవుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీల నేతలు వందల సంఖ్యలో ప్రచార సభలను నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో హెలికాఫ్టర్లు, విమానాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.
ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయడానికి వచ్చే జాతీయ నాయకులకు, స్టార్ క్యాంపెయినర్ లకు సమయాన్ని ఆదా చేయడంతోపాటు, సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలను తీసుకోవడానికి ప్రధాన పార్టీల నాయకులు సై అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అద్దె విమానాలకు, హెలికాప్టర్ లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో త్వరగా ప్రయాణం చేయడం కోసం అద్దె విమానాలను హెలికాప్టర్లను ఆశ్రయిస్తున్నారు. లక్షల్లో అద్దె చెల్లిస్తూ అద్దె విమానాలను బుక్ చేసుకుంటున్నారు రాజకీయ పార్టీల నాయకులు.
బ్లేడ్ ఇండియా, జెట్ సెట్ గో, అర్బన్ ఎయిర్ మొబిలిటీ, ఇండియన్ ఫ్లై సర్వీసెస్ వంటి కంపెనీలు హెలికాప్టర్లు జెట్ విమానాలను అద్దెకి ఇస్తున్నాయి . ప్రైవేట్ ఏజెన్సీ లతోపాటు సువిధ యాప్ ద్వారా హెలికాప్టర్లు, విమానాలను అద్దెకి తీసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారానికి బెల్ 407, ఎయిర్ బస్ హెచ్125, హెచ్ 130 హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటుంటారు. ఈ హెలికాప్టర్లలో ఐదుగురు ప్రయాణం చేయవచ్చు.
సాధారణంగా సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ అద్దె గంటకు ఒక లక్ష యాభై వేల రూపాయల నుంచి ఉంటుంది. అదే డబుల్ ఇంజన్ అయితే 2 లక్షల 75 వేల రూపాయల వరకు ఉంటుంది. మొత్తంగా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్న నేపథ్యంలో రాబోయే రోజులలో అద్దె హెలికాప్టర్లు, విమానాలకు డిమాండ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే హెలికాఫ్టర్ లు, అద్దె విమానాలను ఉపయోగిస్తే ఆ ఖర్చు కూడా ఎన్నికల ఖర్చు క్రిందే పరిగణించి లెక్కిస్తారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications