మద్యం షాపులకు నోటిఫికేషన్, ఫీజులు - ఎక్కడెక్కడ..మార్గదర్శకాలు.!!
తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దసరా వేళ కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలను లాటరీ పద్దతిలో తీసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు టెండర్ ఫీజులను ఖరారు చేసారు. కొంత కాలంగా మద్యం దుకాణాల నోటిఫికేషన్ పైన ఎక్సైజ్ శాఖ కసరత్తు చేసింది. రెండేళ్ల పాటు దుకాణాలు నిర్వహించేందుకు వీలుగా కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ జారీ అయింది.
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేసారు. రేపటి (శుక్రవారం) నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితిగా నిర్ణయించారు. అలాగే టెండర్ ఫీజును రూ.3 లక్షలుగా నిర్ణయించారు. గతంలో టెండర్ ఫీజు రూ.2లక్షలు ఉండగా.. ఇప్పుడు ఒక లక్ష అదనంగా పెంచుతూ మూడు లక్షలుగా తేల్చారు. అలాగే ఫీజు మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఆరు విడతలుగా చెల్లించే వెసులుబాటు కల్పించారు. దీంతో.. మద్యం వ్యాపారులు మరింత ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సారి మద్యం దుకాణాలకు పోటీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగియనుంది. అలాగే ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు మద్యం దుకాణాలు పొందడానికి అనర్హులుగా పరిగణించబడతారు. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల్లో గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. దీంతో.. పూర్తి విధి విధానాలతో ఈ సారి ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా టెండర్లు... షాపుల కేటాయింపు పూర్తి చేసేందుకు ఎక్సైజ్ శాఖ తుది కసరత్తు చేస్తోంది. అయితే.. కల్లు గీత కార్మికులు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రత్యేకంగా షాపులు కేటాయించటంతో.. ఎలాంటి స్పందన వస్తుందనేది కీలకంగా మారుతోంది. ఎక్సైజ్ విధానంలో మార్పులు చేస్తూ.. రెవిన్యూ పెంపు కోసం ప్రయత్నాలు చేస్తున్న అధికారులు ఈ సారి టెండర్ల పైన భారీ అంచనాలతో ఉన్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications