ఉత్తమ్ సన్యాసుల్లో కలిసిపోతారు: కేటీఆర్, రైతు బంధు పథకంపై శ్రవణ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ నేత, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం మండిపడ్డారు. గడ్డం పెంచిన ప్రతి ఒక్కరు గబ్బర్ సింగ్లు కాలేరని, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీయకుంటే సన్యాసుల్లో కలిసిపోతారన్నారు.
ఉత్తమ్ మాటలు చెప్పడంలో దిట్ట అన్నారు. కాంగ్రెస్ పార్టీని మించిన గలీజ్ పార్టీ ఈ దేశంలో మరొకటి లేదన్నారు. రైతులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. రైతులపై కపట ప్రేమ చూపెడుతోందన్నారు.
కుంభకోణాలు, లంబకోణాలు లేని కాంగ్రెస్ నాయకుడు లేడని, అధికారంలో ఉన్నప్పుడు కమీషన్లు, కాంట్రాక్టులకే పరిమితమైన పార్టీ కాంగ్రెస్ అన్నారు. దేశంలో అందరికీ గుండు కొట్టించిందన్నారు. డెబ్బై ఏళ్లలో ఎవరూ చేయని విధంగా రైతు బంధు పథకంను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని, ఈ పథకాన్ని దేశంలో తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

రైతు బంధు ప్రభుత్వంగా తమ సర్కార్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కాంగ్రెస్ను జనాలు నమ్మడం లేదన్నారు. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ రూ.2 లక్షలు చేస్తామంటే ప్రజలు నమ్మలేదని, రాహుల్ గాంధీ వచ్చి చెప్పినా నమ్మలేదన్నారు.
టీఆర్ఎస్పై దాసోజు శ్రవణ్ నిప్పులు
రైతుబంధు పథకం పెద్ద డ్రామా అని టీపీసీసీ జనరల్ సెక్రటరీ దాసోజ్ శ్రవణ్ మండిపడ్డారు. సెక్యూరిటీ ఫీచర్స్ లేకుండా కొత్త పాస్ పుస్తకాలను ప్రింట్ చేస్తున్నారని, రైతుల పేరిట రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారన్నారు.
పోడు భూములు సాగు చేసే రైతులకు పెట్టుబడి సాయం ఎందుకివ్వరని ప్రశ్నించారు. మిర్చి రైతులను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. కాగా, కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో రైతు బంధు పథకాన్ని కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. రైతులకు కొత్త పాస్ పుస్తకాలను ఆయన అందజేస్తారు. రైతు బంధు పథకం నేపథ్యంలో ఎకరా పొలానికి రైతుకు రూ.4వేలు ఇస్తారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications