రూ.500 కే గ్యాస్ సిలిండర్.. రేవంత్ సర్కార్ శుభవార్త
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. రేషన్ కార్డులు ఉన్నవారే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా 39 లక్షల కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. సరైన వివరాలను నమోదు చేయనివారిని అనర్హులుగా నిర్ణయించారు.
వివరాలు సరిచేసినవారికి కూడా
ప్రజలు గ్యాస్ సిలిండర్ కు సంబంధించిన యునిక్ ఐడీ ఇవ్వవకపోవడంవల్ల రాయితీని పొందలేకపోతున్నారు. అయితే సరైన వివరాలను ఇవ్వనివారు ప్రజాపాలన కేంద్రాల్లో తిరిగి వివరాలు అందిస్తే వారిని అర్హులుగా నిర్ణయించనుంది. ఇలాంటివారు 4.60 లక్షల మంది ఉండగా, వారంతా వివరాలను తిరిగి సమర్పించారు. ప్రస్తుతం వీరికి కూడా రూ.500కే సిలిండర్ అందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 44.10 లక్షల కుటుంబాలకు రాయితీ సిలిండర్లు అందుతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది. రాయితీ సొమ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయాలంటే కనీసం నాలుగు రోజుల సమయం పడుతోంది. అయితే రెండురోజుల్లోగా వీరి ఖాతాల్లో సొమ్ము జమ చేయాలనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు. అధికారులకు ఆదేశాలు కూడా జారీచేశారు.

కేంద్ర మంత్రికి వివరాలందజేసిన కమిషనర్
తాము తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసి తెలియజేశారు. తమ రాష్ట్రం చెల్లించే రాయితీ సొమ్మును వినియోగదారుల ఖాతాల్లో రెండురోజుల్లోపల జమచేయాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టడంలో ఆరు గ్యారంటీలు కీలక పాత్ర పోషించాయి. ప్రతి నెలా మహిళలకు రూ.2వేల ఆర్థిక సాయం, రూ.500 సిలిండర్, రైతు భరోసా కింద రూ.15వేలు, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, నెలకు రూ.4వేల చొప్పున చేయూత పింఛన్లు ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయి.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications