తెలంగాణ శాసనమండలి మరింత పటిష్టం.!రెండు కీలక కమిటీలను నియమించిన మండలి ఛైర్మన్.!
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలోని కమిటీ హాల్ లో శాసన మండలి అర్జీల సమితిని, అలాగే విశేషా అధికారాల కమిటీని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. శాసన మండలి అర్జీల కమిటీ, ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కు, శాసన మండలి అర్జీల కమిటీ, ప్రివిలేజ్ కమిటీ సభ్యులకు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాసన మండలి చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర శాసన పరిషత్తు సమావేశాల సందర్భంగా అనేక రకాల సమస్యలు ప్రస్థావనకు వస్తుంటాయని, ఏదైనా సందర్భంలో ప్రభుత్వ దృష్టికి రాని ప్రజా సమస్యలను గౌరవ సభ్యులు ఆర్జీల రూపంలో, శాసన పరిషత్తుకు సమర్పిస్తారు కాబట్టి ఈ కమిటీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు.
తెలంగాణ శాసన మండలిలో నూతన అద్యాయం..
కమిటీకి సిఫార్సు చేసిన అర్జీలని పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి, ప్రజలకు న్యాయం చేసే విధంగా కమిటీ చర్యలు తీసుకోవాలనికోరుకుంటున్నట్టు గుత్తా తెలిపారు. తద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ సమితికి ఉన్న ప్రాధాన్యతా దృష్ట్యా సభ్యులంతా క్రమం తప్పకుండా, సమావేశాలకు హాజరై, గౌరవ సభ్యుల ద్వారా సభకు సమర్పించే అర్జీలు త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుని శాసన పరిషత్తు యొక్క గౌరవాన్ని పెంచుతారననే ఆశాభావాన్ని ప్రివిలేజ్ కమిటీ లో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యక్తం చేసారు.

గౌరవ సభ్యులకు కొన్ని విశేషమైన అధికారాలు, హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం ఇవ్వబడ్డాయని, వాటికి భంగం కలిగినట్లైతే, వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవడానికి విశేషాధికారముల కమిటీకి సర్వాధికారాలు ఉంటాయన్నారు గుత్తా. శాసన పరిషత్తు సభ్యుల గౌరవాన్ని, హక్కులను కాపాడే ఉద్దేశ్యంతోనే విశేషాధికారముల కమిటీ ఏర్పాటైనందున, సభ్యుల విశేషాధికారములకు ఏమైనా భంగం వాటిల్లినట్లైతే వాటికి సంబంధించిన అంశాల్ని కమిటీ అధ్యక్షులు లేదా తన దృష్టికి తెచ్చినట్లైతే వాటిని కమిటీకి రెఫర్ చేయడం జరుగుతుందనీ, కమిటీ ఆయా అంశాలపై క్షుణ్ణంగా చర్చించేందుకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకొని, చర్చించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఛైర్మన్.

గౌరవ సభ్యుడు తన హక్కులకు భంగం వాటిల్లిందని భావించిన సందర్భంలో కమిటీ ముందుకు తప్పనిసరిగా రావాలనీ, వచ్చి వాటిని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. సభ్యులు జిల్లాల్లో పర్యటించే సందర్భంలో సభ్యులకు సంబంధించిన ప్రొటోకాల్ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంటుందనీ, ప్రభుత్వం నుండి వచ్చిన ప్రొటోకాల్ నిబంధనలను వారు తూచా తప్పకుండా పాటించాల్సిందే అని ఆయన తెలిపారు. ఏదైనా సందర్భంలో ప్రొటోకాల్ వాయిలేషన్ జరిగినప్పుడు, అధికారులు కావాలనే ఆ విధంగా చేస్తున్నారన్న భావన గౌరవ సభ్యుల్లో ఏర్పడకూడదన్నారు ఛైర్మన్.

ఎలాంటి అపోహలకు ఆస్కారం ఇవ్వకుండా అధికారులు, సభ్యుల గౌరవ మర్యాదలకు మరియు వారి హక్కులకు సంబంధించిన అంశాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకొని పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ఫరూక్ హుస్సేన్, సిరికొండ మధుసూదన చారి, శేరి శుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ డా.నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.

-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications