'బీసీల నుండి టీడీపీని దూరం చేయలేరు'
హైదరాబాద్: బీసీలను తెలుగుదేశం పార్టీ నుండి ఎవరు దూరం చేయలేరని తెలుగుదేశం పార్టీ నేత ప్రతాప్ రెడ్డి సోమవారం అన్నారు. యాదవులను, బీసీలను రాజకీయంగా పైకి తీసుకు వచ్చింది తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి చిల్లర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. సిద్దిపేటలో యాదవ కమ్యూనిటీ హాల్ కోసం టీడీపీ స్థలం కేటాయించినా ఇప్పటి వరకు భవనం కట్టలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి దమ్ముంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.

కాగా, మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అదినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... టీడీపీ లేకుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దిపేటలో పశువులు కాసేవారని వ్యాఖ్యానించారు. దీని పైన తెలంగాణ రాష్ట్ర సమితి, కొందరు యాదవులు మండిపడ్డారు.
మరోవైపు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య ఆ పార్టీకి దూరమై, కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీల కోసం పార్టీ పెట్టవచ్చునని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతాప్ రెడ్డి స్పందించారు.
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications