Telangana: డేంజర్ జోన్ లో తెలంగాణ.. 46 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు..!
రాష్ట్రంలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తెలంగాణలో ఎండల తీవ్ర కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో
వడగాలులు వీస్తాయని ప్రకటించింది.
వడగాలుల నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా మధ్యాహ్నం 12:00 నుంచి 3:00 గంటల మధ్య ఎండలో బయటికి రాకుండా ఉండాలని తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలు, పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలకు దూరంగా ఉండాలని డిపార్ట్మెంట్ ప్రజలను కోరింది. ఎందుకంటే అవి ఎక్కువ శరీర ద్రవాలను కోల్పోవటానికి లేదా కడుపు తిమ్మిరికి కారణం కావచ్చు.

శిశువులు, చిన్నపిల్లలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు, మానసిక వ్యాధులు లేదా శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వడ దెబ్బ తగలకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మే 5 వరకు వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. మే 2న ఈశాన్య రాష్ట్రలైన నాగలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Heat wave conditions likely in isolated pockets of Gangetic West Bengal, Jharkhand, Odisha, Madhya Maharashtra, Marathwada, Saurashtra, Gujarat region, Rayalaseema, Telangana and North Interior Karnataka on 05th May, 2024. pic.twitter.com/JgDhKPcE0k
— India Meteorological Department (@Indiametdept) May 1, 2024
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications