సానియా మీర్జాకు ప్రధాని మోదీ రెండు పేజీల లెటర్..
ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. దేశ ప్రతిష్ఠను పెంచేలా చేశారని ప్రశంసించారు. దీనికి ఆమె బదులిచ్చారు.
హైదరాబాద్: హైదరాబాద్ కు చెందిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా.. ఇటీవలే తన కేరీర్ కు గుడ్ బై చెప్పారు. టెన్నిస్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చిట్టచివరి మ్యాచ్ కూడా ఆడేశారు. లైఫ్ అప్ డేట్ అంటూ జనవరి 13వ తేదీన ఓ లెటర్ ను ఆమె తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. తన కేరీర్ లోని ముఖ్య ఘట్టాలన్నింటినీ అందులో పొందుపర్చారు. టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు.
కిందటి నెలలో చివరి టోర్నీ ఆడారు. ఓటమితో ముగించారు. దుబాయ్ ఓపెన్ డబ్ల్యూటీఏలో డబుల్స్ లో అమెరికాకి చెందిన మాడిసన్ కీస్ తో కలిసి ఆడిన ఈ మ్యాచ్ లో సానియా మీర్జా పరాజయాన్ని చవి చూశారు. ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ రౌండ్ని కూడా దాటలేకపోయారు. రష్యాకు చెందిన వెర్నోకియా-సంసొనోవా చేతిలో 4-6, 0-6 తేడా ఓడిపోయారు. 36 సంవత్సరాల వయసులో ఆమె కేరీర్ కు గుడ్ బై చెప్పారు.

ఈ సందర్భంగా సానియా మీర్జాను అభినందిస్తూ ఈ నెల 9వ తేదీన ప్రధాని మోదీ ఆమెకు రెండు పేజీల లేఖ రాశారు. లైఫ్ అప్ డేట్ అంటూ జనవరి 13వ తేదీన పెట్టిన పోస్ట్ తనను కదిలించిందని పేర్కొన్నారు. విమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ లల్లో గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లల్లో సాధించిన విజయాలు.. యువ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చాయని కితాబిచ్చారు. ఆరు సంవత్సరాల వయస్సు నుంచే టెన్నిస్ పట్ల ఆసక్తి చూపడం అసాధారణమని పేర్కొన్నారు.
I would like to thank you Honorable Prime Minister @narendramodi Ji for such kind and inspiring words .I have always taken great pride in representing our country to the best of my ability and will continue to do whatever I can to make India proud . Thank you for your support. pic.twitter.com/8q2kZ2LZEN
— Sania Mirza (@MirzaSania) March 11, 2023
ఈ లెటర్ ను సానియా మీర్జా ఇవ్వాళ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. తనను అభినందిస్తూ లేఖ రాసిన ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మోదీ తనకు లేఖ రాయడాన్ని చిరస్మరణీయంగా భావిస్తానని వ్యాఖ్యానించారు. మన దేశానికి ప్రాతినిథ్యాన్ని వహించడం తనకు ఎప్పుడూ గర్వకారణమేనని పేర్కొన్నారు. దేశం గర్వించేలా క్రీడారంగం అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
-
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications