ఎల్లమ్మ దేవాలయంలో చోరీ: దొంగల అరెస్టు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తాండూరు రూరల్ మండల పరిధిలోని కొత్లాపూర్ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో చోరీకి పాల్పడినవారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీఐ రవి సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
గత నెల 31న స్థానిక దేవాలయంలో అర్ధరాత్రి దొంగలుపడి హుండీలోని డబ్బులు దోచుకెళ్లారు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డాగ్స్క్వాడ్ గ్రామంలోని నీళ్లపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆగిపోయాయి.
దీంతో స్థానికులే చోరీకి పాల్ప డ్డారని గ్రహించి పోలీసులు విచారణ ముమ్మ రం చేసి కేసును ఛేదించారు. స్థానికంగా ఉండే నాందేవ్,మేకుల దస్తప్ప, నీళ్లపల్లి శ్రీనివాస్, ఈడ్గి వెంకటప్ప దేవాలయంలో చొర బడి హుండీలో ఉన్న రూ.9.325 ఎత్తుకెళ్లినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు.
అందులో రూ. 6 వేలు ఖర్చు చేయగా మిగిలిన రూ. 3325 పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. నలుగురు నిందితులను రిమాండ్కు పంపించినట్లు ఆయన వెల్లడించారు.