Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ వార్తల్లో నిజం లేదు: కొండా సురేఖ

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కొందరు కావాలనే కుత్రపూరితంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

గత ప్రభుత్వ హయాంలో వేములవాడ దేవస్థానానికి భక్తులు సమర్పించిన కోడెల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతో.. వాటిలో కొన్ని మరణించాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మొక్కుల రూపంలో భక్తులు రాజరాజేశ్వర స్వామికి సమర్పించిన కోడెల నిర్వహణకు విధివిధానాలను రూపొందించేందుకు మే నెలలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, వేములవాడ ఆలయ ఈవో కన్వీనర్‌గా, పలువురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు.

There is no truth in the news regarding Vemulawada Rajanna Kodela Konda Surekha

ఈ మార్గదర్శకాలను పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, సంబంధిత మండల వ్యవసాయ అధికారి జారీ చేసిన ధృవీకరణ పత్రాలు నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే ఒక రైతుకు రెండు కోడెల చొప్పున ఇస్తున్నామని మంత్రి సురేఖ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోడెల సంరక్షణ కోసం గోశాలలో సీసీ ఫ్లోరింగ్, సిరిపడా షెడ్లు, తాగునీటి వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కొండా సురేఖ వివరించారు.

తమ ప్రభుత్వం గోశాలల నిర్వహణ, గోవుల సంరక్షణ చేపడుతున్న క్రమంలో కోడెలను అక్రమంగా విక్రయించారంటూ వచ్చిన వార్తలు వట్టి వదంతులేనని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సాధారణంగా తన వద్దకు వచ్చే దరఖాస్తులను పరిశీలించాలని అధికారులకు సూచిస్తుంటామన్నారు. అదే విధంగా కోడెల పంపిణీకి సంబంధించి వచ్చిన దరఖాస్తులను కూడా పంపించినట్లు కొండా సురేఖ తెలిపారు.

దేవస్థానం అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే రైతులకు కోడెలను పంపిణీ చేశారని కొండా సురేఖ తెలిపారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానంలోని ప్రతి కోడెకు శాశ్వతమైన ట్యాగ్ ఉంటుందని, అటువంటి ట్యాగులున్న కోడెలు ఎక్కడా పట్టుబడలేదని చెప్పారు.

ఈ వ్యవహారానికి సంబంధించి నిజానిజాలను వెల్లడిస్తూ శుక్రవారం రాజరాజేశ్వర దేవస్థానం ఈవో స్పష్టనిచ్చారని చెప్పారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నదంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. సమాజంలో అశాంతిని సృష్టించే అసాంఘిక శక్తులను వెలికితీసి, చట్టపరంగా చర్యలు చేపడతామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+