వైన్ షాపులో దొంగతనం: షట్టర్ మధ్యలో ఇరుక్కుపోయిన దొంగ
హైదరాబాద్: దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగ షట్టర్ మధ్యలో ఇరుక్కుపోయిన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్లోని రంగ సాయి వైన్స్లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఓ దొంగ పుల్లుగా మద్యం సేవించి మద్యం షాపులోనే చోరీకి యత్నించాడు. షట్టర్ తెరుచుకుని షాపులోకి వెళ్లేందుకు యత్నించగా అనుకోని పరిణామాల్లో అతడు వైన్ షాపు షట్టర్లో ఇరుక్కుపోయాడు. షట్టర్ మధ్యలో ఇరుక్కుని బయటకు రాలేక పెద్దగా కేకలు పెట్టసాగాడు.

దీంతో అక్కడికి వచ్చిన స్ధానికులు అతడిని రక్షించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వైన్ షాపులో చోరీ కోసమే అతడు వచ్చాడంటూ స్థానికులు, యాజమాన్యం చెబుతుండగా, మద్యం కోసమే వచ్చానని ఆ దొంగ చెబుతున్నాడు.
ఈ విషయాల్లో ఏది నిజమో తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దొంగను తాండూరు మండలానికి చెందిన శంకర్ నాయక్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications