హైదరాబాద్లో కలకలం: ఇద్దరు అమ్మాయిలు, తనయుడు సహా కుటుంబం ఆత్మహత్య
హైదరాబాద్లో ఓ చోట ముగ్గురు యువతుల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపుతోంది. నార్సింగి సమీపంలోని కొల్లూరు వద్ద ముగ్గురు యువతుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
హైదరాబాద్: హైదరాబాద్: హైదరాబాద్లోని నార్సింగి సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న వారిలో తల్లిదండ్రులు, ఇద్దరు అమ్మాయిలు, తనయుడు ఉన్నారు. మృతుల్లో మూడేళ్ల బాలుడు ఉన్నారు.
చదవండి: కొత్తకోణం: ఆర్థిక ఇబ్బందుల్లేవు, అనుమానాల్లేవు: రవీందర్ రెడ్డి, కేక్లో విషం కలుపుకొని ఆత్మహత్య
రెండు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదయినట్లుగా పోలీసులు చెప్పారు. అంతలోనే విషాదం చోటు చేసుకుంది. మృతుల్లో మూడేళ్ల బాలుడు ఉన్నాడు. ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నట్లు డీసీపీ పద్మజ వెల్లడించారు.
మృతులు రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులుగా తెలుస్తోంది. మృతుల వివరాలు.. లక్ష్మీ (రవీందర్ రెడ్డి భార్య) సింధూజ (రవీందర్ రెడ్డి కూతురు), ప్రభాకర్ రెడ్డి (రవీందర్ రెడ్డి వదిన కొడుకు), మాధవి (ప్రభాకర్ రెడ్డి భార్య), వర్షిత్ (ప్రభాకర్ రెడ్డి తనయుడు).
ఐదు మృతదేహాలు
మృతులను అమీన్పురాకు చెందిన ప్రభాకర్ రెడ్డి, మాధవి, వర్షిత్, లక్ష్మి, సింధూజలుగా గుర్తించారు. చెట్ల పొదల్లో తల్లి, ఇద్దరు కుమార్తెలు పడి ఉన్నారు. సమీపంలోని కారులో తండ్రి, తనయుడు మృతదేహం పడి ఉంది.
ఆర్థిక కారణాలతో ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రభాకర్ రెడ్డికి వ్యాపారంలో నష్టం వచ్చినట్లుగా చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం వచ్చింది. ఈ నేపథ్యంలో వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
మిస్సింగ్ కేసు నమోదు
మృతి చెందిన వారు అమీన్పురకు చెందిన కుటుంబంగా గుర్తించారు. రెండు రోజుల క్రితం వీరి విషయమై మిస్సింగ్ కేసు నమోదయినట్లు డిసిపి పద్మజ వెల్లడించారు. వారి శరీరాల పైన ఎలాంటి గాయాలు లేవని చెప్పారు.
అన్ని కోణాల్లో దర్యాఫ్తు
అంతకుముందు, ఔటర్ రింగు రోడ్డులో మృతదేహాలు పడి ఉన్నాయనే విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నార్సింగి పోలీసులు దర్యాఫ్తు చెపట్టారు. సంఘటన స్థలానికి క్లూస్ టీంను పంపించారు. ఆత్మహత్య, హత్య కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.