వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Crime News: కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్థినిలు..

ముగ్గురు విద్యార్థినిలు కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగారు.

|
Google Oneindia TeluguNews

కొన్ని సార్లు చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాల మీదకు తీసుకొస్తాయి. తాజాగా ఆ పాఠశాలలో కూల్ డ్రింక్ బాటిల్ లో పురుగుల మందు పోసి ఓ చోట పెట్టారు. అయితే ఏమి తెలియని ముగ్గురు విద్యార్థినిలు ఆ బాటిల్ లో కూల్ డ్రింక్ ఉందనుకుని తాగారు. ఆ వెంటనే అస్వస్థతకు గురైన ఘటన ములుగు జిల్లా వెంకటపూర్ మండలం కేశవాపూర్ లోని ఒడ్డెరగూడెం పాఠశాలలో జరిగింది.\

పురుగుల మందు

పురుగుల మందు

ఒడ్డెరగూడెం పాఠశాలలో ఆరెపల్లి అక్షర, సాదు అఖిల, సాదు ఐశ్వర్య 4వ తరగతి చదువుతున్నారు. వారు కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగారు. ఆ వెంటనే అస్వస్థతకు గురి కావడంతో తోటి విద్యార్థినిలు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడు ఏమైందని ప్రశ్నించగా.. అక్షర బ్యాగులో ఉన్న కూల్ డ్రింక్ తాగామని చెప్పారు.

ప్రాణాపాయం

ప్రాణాపాయం

బాటిల్ చూడగా అందులో తెల్లిని ద్రవణం ఉన్నట్లు ఉపాధ్యాయులు గుర్తించారు. అది పురుగుల మందు వాసన రావడంతో విద్యార్థినిలను వెంటనే ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినిలకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. వారిని 24 గంటల తర్వాత డిశ్చార్జి చేస్తామని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు నాయకులు విద్యార్థినిలను పరామర్శించారు.

కేసు నమోదు

కేసు నమోదు

ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. విద్యార్థిని అక్షర ఆ బాటిల్ ఎక్కడ నుంచి తీసుకొచ్చింది. అసలు ఆ బాటిల్ లో ఎవరు పురుగుల మందు కలిపారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Sometimes small mistakes cost lives. Recently in that school they put insecticide in a cool drink bottle and put it in a place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X