జగిత్యాల జిల్లాలో చిరుత కలకలం.. మామిడి తోటలో అడ్డా.. భయాందోళనలో స్థానికులు..!
జగిత్యాల : జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. మామిడి తోట అడ్డాగా పులి కదలికలు వెలుగు చూడటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతం కావడంతో ఏ సమయంలోనైనా దాడి చేయొచ్చని భయపడుతున్నారు. ఇదివరకు ఇలాంటి ఘటనలు కనిపించకపోవడం.. ఇప్పుడేమో పులి సంచారం బయట పడటం స్థానికులకు చెమటలు పట్టిస్తోంది.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మ్యాడంపల్లిలో చిరుత పులి కనిపించిందనే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాంతో మ్యాడంపల్లి - బీబీ రాజ్ పల్లి గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మామిడి తోటలో పులి సంచరిస్తుండగా కొందరు యువకులు ఈ వీడియో తీసినట్లు ప్రచారం జరుగుతోంది.

సదరు వీడియోలో కొద్ది దూరంలో చిరుత సంచరిస్తుండగా.. మరో పక్కన గేదే కనిపిస్తోంది. దీంతో ఆహారం కోసమే పులి ఇటువైపుగా వచ్చిందేమోనన్నది గ్రామస్తుల అనుమానం. అయితే మామిడి తోటలో పులి కనిపించిందనే వార్త దావానంలో వ్యాపించడంతో చుట్టు పక్క గ్రామాల ప్రజలు భయపడుతున్నట్లు సమాచారం. దాంతో అటు వైపు వెళ్లడానికి జంకుతున్నట్లు తెలుస్తోంది. అదలావుంటే చిరుత సంచారంపై మ్యాడంపల్లి గ్రామ సర్పంచ్ కూడా ధృవీకరించారట.
అదలావుంటే మల్యాల మండలానికే చెందిన కొండగుట్ట ప్రాంతంలోని మసీదు గుట్ట సమీపంలో మేతకు వెళ్లిన గేదేల మందపై రెండు రోజుల కిందట పులి దాడి చేసింది. ఆ క్రమంలో పశువుల కాపరులు కూడా భయాందోళనకు గురయ్యారు. తాజాగా మామిడి తోటలో పులి తిరుగుతోందనే వార్త స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అటవీ అధికారులు ఇప్పటికైనా స్పందించి పులిని బంధించాలని కోరుతున్నారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications