సమాచార హక్కు చట్టంపై టీఆర్ఎస్ రెండు నాల్కల ధోరణి..! లోక్ సభలో అలా.. రాజ్య సభలో ఇలా..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : సమాచార హక్కు చట్టంలో సమాల మార్పులకు కేంద్రం నడుం బిగిదచింది. అంతే కాకుండా హక్కు చట్టాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రణాళిక రచించింది. ఈ విధానం పట్ల టీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించగా లోక్ సభలో తటస్థంగా ఉండిపోయింది. దీంతో గులాబీ పార్టీ వైఖరిపై పలువురు రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. సమాచార కమిషనర్ల వ్యవస్థను కేంద్రం తన చేతిలోకి తీసుకుంది. ఇకమీదట వారి పదవీకాలం, జీతభత్యాలు, వారి హోదా.. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఈ మేరకు 2005 నాటి సమాచా ర హక్కు చట్టానికి తెచ్చిన సవరణలను లోక్సభ ఆమోదించింది. విపక్షాల నిరసన హోరు మధ్య ప్రభుత్వం తనకున్న మెజారిటీతో దీన్ని నెగ్గించుకుంది.

స.హ. కమిషనర్ల అధికారాలకు కత్తెర..! ఇక అంతా కేంద్ర సర్కార్ ఇష్టమే..!!
ఇది సమాచార హక్కు చట్ట స్ఫూర్తిని, స్వతంత్ర్యతను కాలరాస్తుందని, ఆ వ్యవస్థలోని పారదర్శకతను దెబ్బతీసి, కోరల్లేని కాగితపు పులిలా మారుస్తుందని కాంగ్రెస్, టీఆర్ఎస్, టీఎంసీ, డీఎంకే, బీజేడీ.. లాంటి పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. తమ మాట వినడానికి అవకాశం ఇవ్వనందుకు నిరసనగా ఈ పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. కాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీన్ని సమర్ధించింది.ఆర్టీఐ చట్టంలోని సెక్షన్లు 13, 16లకు ప్రధాన సవరణలు చేశారు. సెక్షన్ 13 ప్రకారం.. కేంద్ర స్థాయిలో నియమించే ముఖ్య సమాచార కమిషనర్(సీఐసీ), సమాచార కమిషనర్లకు ఐదేళ్ల కాలపరిమితి లేదా 65 ఏళ్ల వయోపరిమితి (ఏది ముందయితే అది) ఉండేది.

ఆర్టీఐ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం..! విపక్షాలు నిరసన... వాకౌట్..!!
అయితే తాజా సవరణ ప్రకా రం కేంద్రం నిర్దేశించిన గడువు మేరకే వారు ఆ పదవిలో ఉంటారు. పాత నిబంధనల ప్రకారం వారి జీతాలు, అలవెన్సులు, ఇతర సర్వీసు నిబంధనలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లతో సమానంగా ఉండేవి. తాజా సవరణ ప్రకారం 'ప్రభుత్వం నిర్దేశించిన మేరకు' ఈ జీతభత్యాలుంటాయి. ఇక సెక్షన్ 16 ప్రకారం రాష్ట్ర స్థాయి ముఖ్య సమాచార కమిషనర్ హోదా, జీతభత్యాలు, పదవీకాల పరిమితి అన్నీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్థాయితో సమానంగానూ, రాష్ట్ర స్థాయి కమిషనర్ల హోదా, జీతాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమానంగానూ ఉండేవి. దాన్నిపుడు తీసేశారు.

టీఆఎస్ ద్వంధ వైఖరి..! రాజ్యసభలో వ్యతిరేకత..లోక్ సభలో తటస్థం..!!
వీరి పదవీకాలం కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే మేరకు ఉంటుంది. చివరకు బిల్లుపై ఓటింగ్ జరిగి 218-79 ఓట్ల తేడాతో వీగిపోయింది. కాగా, రాజ్యసభలో ఈ బిల్లు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్ష ఎంపీలందరూ రాజ్యసభ ఛైర్మన్కు ఓ లేఖ రాశారు. ఈ బిల్లు సమాచార హక్కు చట్టం మౌలిక స్వభావాన్నే దెబ్బతీస్తుందని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అభిప్రాయపడ్డారు. అయితే టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు మాత్రం తాము లోక్సభలో బిల్లుపై తటస్థ వైఖరి అవలంబించినట్లు చెప్పడం విశేషం.

ఆర్టీఐ చట్టానికి దొంగదెబ్బ..! సవరణలు ఎందుకంటున్న మాజీ కమీషనర్ మాడభూషి..!!
సమాచార హక్కు చట్టాని(ఆర్టీఐ)కి సవరణ తీసుకురావడం 'తప్పుడు చర్య' అనీ, దీని ద్వారా ప్రభుత్వం కేంద్ర సమాచార కమిషన్ను దొంగ దెబ్బతీసేందుకు యత్నిస్తోందని మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ విమర్శించారు. ఈ సవరణ ఆర్టీఐని చావుదెబ్బతీస్తుందని, సమాచార కమిషన్ల స్వయం ప్రతిపత్తికి తూట్లు పొడుస్తుందని ఆయన అన్నారు. ఈ సవరణ బిల్లుని తిరస్కరించాలని కోరుతూ శ్రీధర్ ఎంపీలందరికీ లేఖలు రాశారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications