టిడిపి నుండి వచ్చిన వారికే ప్రాధాన్యత, టిఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య
హైదరాబాద్: ఫ్రోఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్శిటీ గార్డెన్ లో మహిపాల్ రెడ్డి అనే టిఆర్ఎస్ కార్యకర్త ఆదివారం నాడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లికి చెందిన టిఆర్ఎస్ కార్యక్త మహిపాల్ రెడ్డి వాకింగ్ వెళ్తానని చెప్పి వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ టిడిపి నుండి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.
టిఆర్ఎస్ కార్యకర్తలకు న్యాయం చేయాలని మహిపాల్ రెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరారు. టిడిపికి వ్యతిరేకంగా పార్టీని బలోపేతం చేసేందుకు తాను ఏ రకంగా పనిచేశానో ఆయన ఆ లేఖలో రాశాడు.

అయితే ఇటీవల జరిగిన కార్పోరేటర్ల ఎన్నికలను కూడ ఆయన ప్రస్తావించారు.అయితే టిడిపి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను పార్టీలో చేర్చుకోవడం వల్ల వారి కిందనే తాము పనిచేయాల్సి వస్తోందన్నారు.అంతేకాదు తమకు న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరో వైపు ఉదయంపూట వాకింగ్ వచ్చిన కొందరు మృతదేహన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.అయితే మృతదేహంలో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications