సాధారణం కంటే 2 డిగ్రీలు అధికం: నగరంపై భానుడి ప్రతాపం..
హైదరాబాద్: నగరవాసులను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత మూడు, నాలుగురోజలుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో జనం ఉక్కపోతను భరించలేకపోతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఎండ చురుక్కుమనిపిస్తోందని వాతావరణవాఖ నిపుణులు చెబుతున్నారు.
ఉదయం పది గంటల నుంచే భానుడు నిప్పులు కురిపిస్తుండటంతో.. బయటకు రావాలంటేనే జనం బయటపడుతున్నారు. అత్యవసరమైతే సాయంత్రం వేళల్లో తప్పితే పగటిపూట చాలావరకు బయటకు రావడం తగ్గిస్తున్నారు. సోమవారం నగరంలో గరిష్ఠం 40.7 డిగ్రీలు, కనిష్ఠం 28.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.













Click it and Unblock the Notifications