హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కలకలం: నగరంలో ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం

హైదరాబాద్‌ నగరంలోని మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు. సైదాబాద్‌ ఏకలవ్య నగర్‌కు చెందిన సంతోష్‌కుమారి కుమార్తె పవిత్ర(19), వైశాలి నగర్‌ శ్రీలక్ష్మీగణేశ్‌ కాలనీకి చెందిన వ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలోని మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు. సైదాబాద్‌ ఏకలవ్య నగర్‌కు చెందిన సంతోష్‌కుమారి కుమార్తె పవిత్ర(19) అద్యశ్యమైంది. ఈమెతోపాటు వైశాలి‌నగర్‌ శ్రీలక్ష్మీగణేశ్‌ కాలనీకి చెందిన వెంకటరమణ కుమార్తె భవానీ(19) అదృశ్యమయ్యారు.

ఈ మేరకు ఈ ఇద్దరు యువతుల తల్లిదండ్రులు వేర్వురుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవీ రంగారెడ్డి కళాశాలలో బీఎస్పీ మొదటి సంవత్సరం చదువుతున్న భవానీ 13వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. పవిత్ర అక్టోబర్ 12న సాయంత్రం టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లి తిరిగి రాలేదు. వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Two teenage girls allegedly missing in Hyderabad on Monday.

వాగులో గల్లంతైన బాలిక మృతి

మహబూబ్‌నగర్: వాగులో గల్లంతైన అమ్ములు (6) అనే గిరిజన బాలిక మృతి చెందింది. ఈ విషాద ఘటన కమ్మాల్‌పూల్ మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామ పంచాయితీ కమ్మాల్‌పూర్‌ తండాలో చోటు చేసుకుంది. తండా వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తండా సమీపంలో వాగులు ఒక్కసారిగా పెద్దఎత్తున వరద రావడంతో కల్వర్టుపై నుంచి ప్రవాహం వస్తుండగా అన్నతో కలిసి ఆడుకుంటూ వెళ్లిన ప్రమాదవశాత్తు కాళ్లు జారి నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యింది.

అన్నవచ్చి తల్లిదండ్రుతో చెప్పడంతో గంటన్నర పాటు వరదలో వెతకగా వంతెన సమీపంలో కంపచెట్లలో చిక్కుకున్న బాలికను గుర్తించి బయటకు తీశారు. అప్పటికే మృతి చెందింది. తల్లితండ్రులు సునిత, కోటేశ్‌లు రోధిస్తున్నారు.

English summary
Two teenage girls allegedly missing in Hyderabad on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X