బావతో అఫైర్: ఇద్దరు ఆత్మహత్య, ఏం జరిగిందంటే?
వరంగల్: మరదలితో వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మరదలిని చంపేసి తాను కూడ ఆత్మహత్య చేసుకొన్న ఘటన వరంగల్ జిల్లాలో సంచలనం చోటు చేసుకొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చిచ్చును పెడతాయి ఇలాంటి ఘటనలను అనేకం మనం చూస్తున్నాం, వింటున్నాం. అయితే అదే తరహ ఘటన ఒకటి వరంగల్ జిల్లాలో చోటు చేసుకొంది.
గ్రేటర్ వరంగల్ నగర పరిధిలోని 55వ, డివిజన్ భీమారంలో అసిస్టెంట్ ప్రోఫెసర్ ప్రవీణ్ రెడ్డి ఆయన మరదలు రక్షణారెడ్డి ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన వరంగల్ నగరంలో కలకలం రేపుతోంది.

వివాహేతర సంబంధంతో ఆత్మహత్య
గ్రేటర్ వరంగల్ నగర పరిధిలోని 55వ, డివిజన్ భీమారంలో అసిస్టెంట్ ప్రోఫెసర్ ప్రవీణ్ రెడ్డి, ఆయన మరదలు రక్షణారెడ్డి ఆత్మహత్య చేసుకొన్నారు. వరంగల్ అర్భన్ జిల్లా ఎల్కతుర్తి మండలం జిలుగులకు చెందిన తిరుపతిరెడ్డి అరుణ దంపతులకు ప్రతిభారెడ్డి, రక్షణారెడ్డి కూతుళ్ళు ఉన్నారు. వీరితో పాటు మరో కుమారుడు కూడ ఉన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్కు చెందిన రావుల రవీందర్ రెడ్డి రాజేశ్వరీ దంపతుల కుమారుడు ప్రవీణ్ రెడ్డితో ప్రతిభారెడ్డికి మూడేళ్ళ క్రితం పెళ్ళైంది. వీరికి రెండేళ్ళ కూతురు కూడ ఉంది. ప్రవీణ్రెడ్డి అసిస్టెంట్ ప్రోఫెసర్గా పనిచేస్తున్నాడు. భార్య సోదరి రక్షణారెడ్డితో ప్రవీణ్ రెడ్డికి వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ సంబంధం బయటకు పొక్కడంతో వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రవీణ్ రెడ్డితో రక్షణరెడ్డికి వివాహేతర బంధం
ప్రవీణ్ రెడ్డికి మరదలు రక్షణారెడ్డితో వివాహేతర సంబంధం ఏర్పడింది. చదువు కోసం నగరంలో ప్రైవేటో కాలేజీలో రక్షణారెడ్డి చేరింది. మూడేళ్ళుగా అక్క ఇంట్లోనే రక్షణారెడ్డి నివాసం ఉండేది. ఈ తరుణంలోనే రక్షణారెడ్డితో ప్రవీణ్ రెడ్డికి వివాహేతర సంబంధం ఏర్పడింది..ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో పంచాయితీ నిర్వహించారు. రక్షణారెడ్డిని ఇంటికి తీసుకెళ్ళారు. అంతేకాదు ప్రవీణ్ రెడ్డిని కూడ పెద్దలు మందలించారు. అయితే చదువుకు ఇబ్బందులు కాకూడదనే ఉద్దేశ్యంతో రక్షణారెడ్డి తన ఇంటి నుండే వరంగల్లోని కాలేజీకి బస్సులో వస్తుండేది.

కాలేజీకి వెళ్ళిన రక్షణారెడ్డి శవంగా మారింది
ఉగాది పండుగ కోసం ప్రవీణ్ రెడ్డి సతీమణి ప్రతిభారెడ్డి తన పుట్టింటికి వెళ్ళింది. అయితే ఉగాది పర్వదినం రోజున ప్రవీణ్ రెడ్డి తన స్వస్థలానికి వెళ్ళాడు. అక్కడి నుండే కాలేజీకి వస్తున్నాడు. అయితే ఉగాది పర్వదినం సందర్భంగా ఇంటికి వెళ్ళిన ప్రతిభారెడ్డి రాలేదు. అయితే ప్రతిరోజూ మాదిరిగానే కాలేజీ కోసం వరంగల్కు వచ్చిన రక్షణారెడ్డి సాయంత్రమైనా ఇంటికి రాలేదు. దీంతో రక్షణారెడ్డికి కుటుంబసభ్యులు ఫోన్లు చేశారు. కానీ, ఆమె ఫోన్ పనిచేయలేదు. ప్రతిభారెడ్డి తండ్రితో కలిసి వరంగల్లోని తన ఇంటికి వెళ్ళి చూసేసరికి రక్షణారెడ్డి మంచంపై శవమై పడి ఉంది.

ఆత్మహత్య చేసుకొన్న ప్రవీణ్ రెడ్డి
రక్షణారెడ్డి బెడ్మీద చనిపోయి ఉండగా ఆమె బెడ్ పక్కనే ప్రవీణ్ రెడ్డి మృతదేహం పడి ఉంది. రక్షణారెడ్డిని చంపేసి ప్రవీణ్ రెడ్డి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రవీణ్ రెడ్డి ఆత్మహత్యచేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాడని పోలీసులు చెప్పారు. ఐదు రోజుల క్రితమే ప్రవీణ్ రెడ్డి సూసైడ్ నోట్ రాశాడు.ఈ నోట్ ప్రకారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications